సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు శుక్రవారం తమ అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టు గురువారం రాత్రి మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఆయనను అనుమతించింది. దీంతో శుక్రవారం గుంటూరు జైలుకు వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే.. పోలీసుల కస్టడీలో తనను కొట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని కృష్ణంరాజు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే.. దీనికి రక్షణ కల్పిస్తూ.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును ప్రశ్నించనున్నారు. అమరావతి రాజధానిని వేశ్యల రాజధానితో పోల్చుతూ.. ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కూపీ లాగనున్నారు. ఈ నెల 6న వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జరిగిన డిబేట్లో కృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును పోలీసులు శ్రీకాకుళంలో అరెస్టు చేసి తీసుకువచ్చారు. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు? ఎవరి ప్రోద్బలంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? రాజధానిపై కుట్రలు ఎవరు పన్నారు? అనే కీలక విషయాలను తెలుసుకునేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని తుళ్లూరు పోలీసులు కోర్టును అభ్యర్థించడంతో అనుమతిఇచ్చింది. అయితే.. విచారణ సందర్భంగా ఆయనపై చేయి చేసుకోవద్దని సూచించింది.
This post was last modified on June 21, 2025 6:46 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…