ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన ఎంతో ఆసక్తి కనబరిచి.. ఆహ్వానించిన ప్రతిష్టాత్మక సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్.. త్వరలోనే ఏపీకి రానుంది. ఈ మేరకు తాజాగా తన సమ్మతిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్కు సమాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూసన్స్ అనేది అమెరికాకు చెందిన కీలక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో కాగ్నిజెంటును రాష్ట్రానికి రావాలంటూ.. కొన్నాళ్ల కిందట మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన రెండు సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో దాదాపు 21.5 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. దీనిని ఏడాదికి ఎకరాకు రూ.0.99 కే కేటాయించారు.
ఈ ప్రతిపాదనల తర్వాత.. స్థానికంగా విచారణ చేసుకున్న సంస్థ.. తాజాగా ఏపీకి వచ్చేందుకు సమ్మతించింది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. తొలి దశలో 1,582 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనివల్ల దాదాపు 8 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరిన్ని రెట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుండడంతో విశాఖ కీర్తి ప్రపంచ దేశాలకు పాకనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
This post was last modified on June 20, 2025 11:01 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…