Political News

లోకేష్ శ‌భాష్‌.. విశాఖ‌కు కాగ్నిజెంట్ రాక‌!

ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆయ‌న ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచి.. ఆహ్వానించిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూష‌న్స్‌.. త్వ‌ర‌లోనే ఏపీకి రానుంది. ఈ మేర‌కు తాజాగా త‌న స‌మ్మ‌తిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్‌కు స‌మాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూస‌న్స్ అనేది అమెరికాకు చెందిన కీల‌క సంస్థ‌. దీని ప్ర‌ధాన కార్యాల‌యం వాషింగ్ట‌న్‌లో ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబ‌డులు పెడుతోంది.

ఈ నేప‌థ్యంలో కాగ్నిజెంటును రాష్ట్రానికి రావాలంటూ.. కొన్నాళ్ల కింద‌ట మంత్రి నారా లోకేష్ ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఆ సంస్థ ప్ర‌తినిధుల‌తో ఆయ‌న రెండు సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని, అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తామ‌ని కూడా చెప్పారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లోని కాపులుప్పాడ ప్రాంతంలో దాదాపు 21.5 ఎక‌రాల భూమిని కూడా కేటాయించారు. దీనిని ఏడాదికి ఎక‌రాకు రూ.0.99 కే కేటాయించారు.

ఈ ప్ర‌తిపాద‌న‌ల త‌ర్వాత‌.. స్థానికంగా విచార‌ణ చేసుకున్న సంస్థ‌.. తాజాగా ఏపీకి వ‌చ్చేందుకు స‌మ్మ‌తించింది.  విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు స‌మ్మ‌తి తెలిపింది. తొలి ద‌శ‌లో 1,582 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. దీనివ‌ల్ల దాదాపు 8 వేల మందికి పైగా యువ‌త‌కు ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. స్థానికంగా మ‌రిన్ని రెట్ల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి.  ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు కానుండ‌డంతో విశాఖ కీర్తి ప్ర‌పంచ దేశాల‌కు పాక‌నుంద‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు.  

This post was last modified on June 20, 2025 11:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago