ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన ఎంతో ఆసక్తి కనబరిచి.. ఆహ్వానించిన ప్రతిష్టాత్మక సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్.. త్వరలోనే ఏపీకి రానుంది. ఈ మేరకు తాజాగా తన సమ్మతిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్కు సమాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూసన్స్ అనేది అమెరికాకు చెందిన కీలక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో కాగ్నిజెంటును రాష్ట్రానికి రావాలంటూ.. కొన్నాళ్ల కిందట మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన రెండు సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో దాదాపు 21.5 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. దీనిని ఏడాదికి ఎకరాకు రూ.0.99 కే కేటాయించారు.
ఈ ప్రతిపాదనల తర్వాత.. స్థానికంగా విచారణ చేసుకున్న సంస్థ.. తాజాగా ఏపీకి వచ్చేందుకు సమ్మతించింది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. తొలి దశలో 1,582 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనివల్ల దాదాపు 8 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరిన్ని రెట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుండడంతో విశాఖ కీర్తి ప్రపంచ దేశాలకు పాకనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
This post was last modified on June 20, 2025 11:01 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…