ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన ఎంతో ఆసక్తి కనబరిచి.. ఆహ్వానించిన ప్రతిష్టాత్మక సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్.. త్వరలోనే ఏపీకి రానుంది. ఈ మేరకు తాజాగా తన సమ్మతిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్కు సమాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూసన్స్ అనేది అమెరికాకు చెందిన కీలక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో కాగ్నిజెంటును రాష్ట్రానికి రావాలంటూ.. కొన్నాళ్ల కిందట మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన రెండు సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో దాదాపు 21.5 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. దీనిని ఏడాదికి ఎకరాకు రూ.0.99 కే కేటాయించారు.
ఈ ప్రతిపాదనల తర్వాత.. స్థానికంగా విచారణ చేసుకున్న సంస్థ.. తాజాగా ఏపీకి వచ్చేందుకు సమ్మతించింది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. తొలి దశలో 1,582 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనివల్ల దాదాపు 8 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరిన్ని రెట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుండడంతో విశాఖ కీర్తి ప్రపంచ దేశాలకు పాకనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
This post was last modified on June 20, 2025 11:01 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…