రాజకీయాల్లో స్నేహం చేయడం, చేతులు కలపడం, సహజంగా జరిగే కార్యక్రమం. ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కాబట్టి సిద్ధాంతాలు వేరైనా పార్టీలు వేరైనా నాయకులు చేతులు కలపడం గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. అయితే దీనికి భిన్నంగా 2019 -24 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చట్టా పట్టాలు ఏసుకొని జగన్ తిరిగారనే మాట అందరికీ తెలిసిందే. ఇది ఎవరు కొట్టి వేయలేని విషయం. నిజానికి బిజెపి సిద్ధాంతాలు వేరు, వైసీపీ సిద్ధాంతాలు వేరు.
బిజెపి ఓటు బ్యాంకు వేరు. వైసీపీ ఓటు బ్యాంకు వేరు. దీంతో నేరుగా ఎక్కడా బిజెపితో పొత్తు పెట్టుకునేందు కు జగన్ సహసించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే తెరచాటున మాత్రమే జగన్ మోడీతో కలిశారు. ఆయనతో కలిసి ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మోడీని మెప్పించారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే జాతీయ స్థాయిలో కలిసి ఉండడం విడిపోవడం రాజకీయంగా ముందుకు సాగడం సాగలేక పోవడం అనేవి పక్కన పెడితే కీలక నేతలను మెప్పించిన పార్టీలు, కీలక నేతలను ఒప్పించిన నాయకులు మాత్రమే ప్రజల్లో మన గలిగారు. మనగలుగుతున్నారు.
దీనికి ప్రధాన ఉదాహరణ చంద్రబాబు. ఒకప్పుడు బీజేపీతో కలిశారు. తర్వాత వదిలేశారు. మళ్లీ గత ఎన్నికలకు ముందు చేతులు కలిపారు. కానీ ఆ తర్వాత నుంచి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే ప్రతి విషయంలోనూ మోడీని మెప్పించే కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తున్నారు. యోగ విషయంలోనే కాదు ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ సింధు(ఇరాన్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చే కార్యక్రమం) వరకు అన్ని విషయాల్లోనూ మోడీని ఆకాశానికి ఎత్తేయడంతో పాటు మోడీ ఈ దేశ నాయకుడు.. ఈయన లేకపోతే దేశం అనేక ఇబ్బందులు పడుతుందన్న వ్యాఖ్యలు చేయడం ద్వారా మోడీ మనసును చంద్రబాబు చూరగొన్నారని చెప్పాలి.
ఈ విషయంలో జగన్ చాలా చాలా వెనకబడిపోయారు. పైకి కలిసున్నామని భరోసా ఉండొచ్చు. కానీ అంతర్గతంగా మోడీ మనసును ఆయన తెలుసుకోలేకపోయారు. మోడీని కూడా మెప్పించలేకపోయారు. దీంతో రాజకీయంగా జగన్ -మోడీల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధాలు అనుబంధాలు దాదాపు ఇప్పుడు తగ్గిపోయాయి అనేది జాతీయ మీడియాలో వస్తున్న విశ్లేషణల ద్వారా స్పష్టం అవుతుంది. మరి భవిష్యత్తులో జగన్ మోడీతో ఎలా ప్రయాణం చేస్తారు, ఎలా కలిసి ఉంటారు అనేది చూడాలి. ఇప్పటికైతే జగన్ ప్లేస్ ను చంద్రబాబు డామినేట్ చేసేసారు అనేది జాతీయ మీడియా చెబుతున్న మాట.
This post was last modified on June 20, 2025 7:54 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…