Political News

జ‌గ‌న్ ప్లేస్‌ను డామినేట్ చేసిన బాబు ..!

రాజకీయాల్లో స్నేహం చేయడం, చేతులు కలపడం, సహజంగా జరిగే కార్యక్రమం. ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కాబట్టి సిద్ధాంతాలు వేరైనా పార్టీలు వేరైనా నాయకులు చేతులు కలపడం గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. అయితే దీనికి భిన్నంగా 2019 -24 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చట్టా పట్టాలు ఏసుకొని జగన్ తిరిగారనే మాట అందరికీ తెలిసిందే. ఇది ఎవరు కొట్టి వేయలేని విషయం. నిజానికి బిజెపి సిద్ధాంతాలు వేరు, వైసీపీ సిద్ధాంతాలు వేరు.

బిజెపి ఓటు బ్యాంకు వేరు. వైసీపీ ఓటు బ్యాంకు వేరు. దీంతో నేరుగా ఎక్కడా బిజెపితో పొత్తు పెట్టుకునేందు కు జగన్ సహసించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే తెరచాటున‌ మాత్రమే జగన్ మోడీతో కలిశారు. ఆయనతో కలిసి ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మోడీని మెప్పించారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే జాతీయ స్థాయిలో కలిసి ఉండడం విడిపోవడం రాజకీయంగా ముందుకు సాగడం సాగలేక పోవడం అనేవి పక్కన పెడితే కీలక నేతలను మెప్పించిన పార్టీలు, కీలక నేతలను ఒప్పించిన నాయకులు మాత్రమే ప్రజల్లో మన గలిగారు. మనగలుగుతున్నారు.

దీనికి ప్రధాన ఉదాహరణ చంద్రబాబు. ఒకప్పుడు బీజేపీతో కలిశారు. తర్వాత వదిలేశారు. మళ్లీ గత ఎన్నికలకు ముందు చేతులు కలిపారు. కానీ ఆ తర్వాత నుంచి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే ప్రతి విషయంలోనూ మోడీని మెప్పించే కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తున్నారు. యోగ విషయంలోనే కాదు ఆపరేషన్ సింధూర్‌ నుంచి ఆపరేషన్ సింధు(ఇరాన్ నుంచి విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చే కార్య‌క్ర‌మం) వరకు అన్ని విషయాల్లోనూ మోడీని ఆకాశానికి ఎత్తేయడంతో పాటు మోడీ ఈ దేశ నాయకుడు.. ఈయన లేకపోతే దేశం అనేక ఇబ్బందులు పడుతుందన్న వ్యాఖ్యలు చేయడం ద్వారా మోడీ మనసును చంద్రబాబు చూరగొన్నారని చెప్పాలి.

ఈ విషయంలో జగన్ చాలా చాలా వెనకబడిపోయారు. పైకి కలిసున్నామని భరోసా ఉండొచ్చు. కానీ అంతర్గతంగా మోడీ మనసును ఆయన తెలుసుకోలేకపోయారు. మోడీని కూడా మెప్పించలేకపోయారు. దీంతో రాజకీయంగా జగన్ -మోడీల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధాలు అనుబంధాలు దాదాపు ఇప్పుడు తగ్గిపోయాయి అనేది జాతీయ మీడియాలో వస్తున్న విశ్లేషణల ద్వారా స్పష్టం అవుతుంది. మరి భవిష్యత్తులో జగన్ మోడీతో ఎలా ప్రయాణం చేస్తారు, ఎలా కలిసి ఉంటారు అనేది చూడాలి. ఇప్పటికైతే జగన్ ప్లేస్ ను చంద్రబాబు డామినేట్ చేసేసారు అనేది జాతీయ మీడియా చెబుతున్న మాట.

This post was last modified on June 20, 2025 7:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago