Political News

జ‌గ‌న్ ప్లేస్‌ను డామినేట్ చేసిన బాబు ..!

రాజకీయాల్లో స్నేహం చేయడం, చేతులు కలపడం, సహజంగా జరిగే కార్యక్రమం. ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కాబట్టి సిద్ధాంతాలు వేరైనా పార్టీలు వేరైనా నాయకులు చేతులు కలపడం గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. అయితే దీనికి భిన్నంగా 2019 -24 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చట్టా పట్టాలు ఏసుకొని జగన్ తిరిగారనే మాట అందరికీ తెలిసిందే. ఇది ఎవరు కొట్టి వేయలేని విషయం. నిజానికి బిజెపి సిద్ధాంతాలు వేరు, వైసీపీ సిద్ధాంతాలు వేరు.

బిజెపి ఓటు బ్యాంకు వేరు. వైసీపీ ఓటు బ్యాంకు వేరు. దీంతో నేరుగా ఎక్కడా బిజెపితో పొత్తు పెట్టుకునేందు కు జగన్ సహసించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే తెరచాటున‌ మాత్రమే జగన్ మోడీతో కలిశారు. ఆయనతో కలిసి ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మోడీని మెప్పించారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే జాతీయ స్థాయిలో కలిసి ఉండడం విడిపోవడం రాజకీయంగా ముందుకు సాగడం సాగలేక పోవడం అనేవి పక్కన పెడితే కీలక నేతలను మెప్పించిన పార్టీలు, కీలక నేతలను ఒప్పించిన నాయకులు మాత్రమే ప్రజల్లో మన గలిగారు. మనగలుగుతున్నారు.

దీనికి ప్రధాన ఉదాహరణ చంద్రబాబు. ఒకప్పుడు బీజేపీతో కలిశారు. తర్వాత వదిలేశారు. మళ్లీ గత ఎన్నికలకు ముందు చేతులు కలిపారు. కానీ ఆ తర్వాత నుంచి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే ప్రతి విషయంలోనూ మోడీని మెప్పించే కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తున్నారు. యోగ విషయంలోనే కాదు ఆపరేషన్ సింధూర్‌ నుంచి ఆపరేషన్ సింధు(ఇరాన్ నుంచి విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చే కార్య‌క్ర‌మం) వరకు అన్ని విషయాల్లోనూ మోడీని ఆకాశానికి ఎత్తేయడంతో పాటు మోడీ ఈ దేశ నాయకుడు.. ఈయన లేకపోతే దేశం అనేక ఇబ్బందులు పడుతుందన్న వ్యాఖ్యలు చేయడం ద్వారా మోడీ మనసును చంద్రబాబు చూరగొన్నారని చెప్పాలి.

ఈ విషయంలో జగన్ చాలా చాలా వెనకబడిపోయారు. పైకి కలిసున్నామని భరోసా ఉండొచ్చు. కానీ అంతర్గతంగా మోడీ మనసును ఆయన తెలుసుకోలేకపోయారు. మోడీని కూడా మెప్పించలేకపోయారు. దీంతో రాజకీయంగా జగన్ -మోడీల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధాలు అనుబంధాలు దాదాపు ఇప్పుడు తగ్గిపోయాయి అనేది జాతీయ మీడియాలో వస్తున్న విశ్లేషణల ద్వారా స్పష్టం అవుతుంది. మరి భవిష్యత్తులో జగన్ మోడీతో ఎలా ప్రయాణం చేస్తారు, ఎలా కలిసి ఉంటారు అనేది చూడాలి. ఇప్పటికైతే జగన్ ప్లేస్ ను చంద్రబాబు డామినేట్ చేసేసారు అనేది జాతీయ మీడియా చెబుతున్న మాట.

Kumar

Recent Posts

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

2 hours ago

పుష్ప విలన్ కామెడీ చేస్తే…

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…

3 hours ago

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…

3 hours ago

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…

4 hours ago

కర్ణుడి కాంట్రావర్సి… కల్కి దర్శకుడి కౌంటర్

విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…

4 hours ago

పైరసీని నిలువరించడం సాధ్యమవుతుందా

ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…

5 hours ago