ఢిల్లీ రాజకీయాలను గమనిస్తే టిడిపి యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాది కాలంలో ఇప్పటివరకు అయినా 6 సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. ఇది చిత్రం కాదు వాస్తవం. ఢిల్లీ పర్యటనలో మూడుసార్లు కేంద్ర మంత్రులు కలిశారు. ఒకసారి ప్రధానమంత్రిని కలిశారు. రెండుసార్లు పార్టీ ఎంపీలను కలిశారు. అలాగే సొంత పనుల మీద రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. మొత్తంగా అన్ని పర్యటనలలోనూ ఢిల్లీలో నారా లోకేష్ పాత్ర పెరుగుతోంది. ఇది ఎటువంటి సంకేతాలను ఇస్తోంది. అసలు నారా లోకేష్ ఢిల్లీకి గతంలో వెళ్లని నాయకుడు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ.
వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు మాత్రమే ఢిల్లీకి పదేపదే వెళ్లేవారు. అప్పట్లో బీజేపీతో కలిసి ఉండటం రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకురావడం కోసం ఆయన ఢిల్లీలో పర్యటించేవారు. ప్రధానిని కూడా కలిసేవారు. ఇతర పనులపై కూడా ఢిల్లీకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో గత ఏడాది ఏర్పడిన కూటమి ప్రభుత్వం తర్వాత నారా లోకేష్ కు ఢిల్లీలో ప్రధాన్యం పెరుగుతోంది.
కేంద్ర మంత్రులను పరిచయం చేసుకోవడం కేంద్రంలో రాజకీయ నాయకులతో ఆయన సత్సంబంధాలను పెంచుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో జాతీయ నాయకుడిగా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ఆ స్థానాన్ని ఆక్రమించే దిశగా కూడా టిడిపి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. టిడిపిలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మాత్రమే జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. గతంలో ఎన్టీ రామారావు ఉన్నా ఆ తర్వాత మరో నాయకుడు అంటూ లేకుండా పోయారు.
ఎర్రన్నాయుడు కొన్ని రోజులు పార్లమెంట్ లోను జాతీయ స్థాయిలోనూ టిడిపి తరఫున చక్రం తిప్పినా ఆయన తరువాత చంద్రబాబు నాయుడు ఆ స్థానం మరి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థానాన్ని తిరిగి మంత్రి నారా లోకేష్ కు అప్పగిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేంద్ర మంత్రులను కలుసుకుంటున్నారు. పదేపదే వారితో చర్చిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై గళం వినిపిస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రిని కూడా ఆయన ఇండివిడ్యువల్ గా కలుసుకున్నారు. ఫ్యామిలీతో సహా కలిసి తన పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని బహుమానంగా అందించారు.
This post was last modified on June 20, 2025 2:00 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…