Political News

50 ప‌ర్సెంట్ ఢిల్లీ పాలిటిక్స్‌ లోకేష్ వే.. నో డౌట్‌.. !

ఢిల్లీ రాజకీయాలను గమనిస్తే టిడిపి యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాది కాలంలో ఇప్పటివరకు అయినా 6 సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. ఇది చిత్రం కాదు వాస్తవం. ఢిల్లీ పర్యటనలో మూడుసార్లు కేంద్ర మంత్రులు కలిశారు. ఒకసారి ప్రధానమంత్రిని కలిశారు. రెండుసార్లు పార్టీ ఎంపీలను కలిశారు. అలాగే సొంత పనుల మీద రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. మొత్తంగా అన్ని పర్యటనల‌లోనూ ఢిల్లీలో నారా లోకేష్ పాత్ర పెరుగుతోంది. ఇది ఎటువంటి సంకేతాలను ఇస్తోంది. అసలు నారా లోకేష్ ఢిల్లీకి గతంలో వెళ్లని నాయకుడు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ.

వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు మాత్రమే ఢిల్లీకి పదేపదే వెళ్లేవారు. అప్పట్లో బీజేపీతో కలిసి ఉండటం రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకురావడం కోసం ఆయన ఢిల్లీలో పర్యటించేవారు. ప్రధానిని కూడా కలిసేవారు. ఇతర పనులపై కూడా ఢిల్లీకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో గత ఏడాది ఏర్పడిన కూటమి ప్రభుత్వం తర్వాత నారా లోకేష్ కు ఢిల్లీలో ప్రధాన్యం పెరుగుతోంది.

కేంద్ర మంత్రులను పరిచయం చేసుకోవడం కేంద్రంలో రాజకీయ నాయకులతో ఆయన సత్సంబంధాలను పెంచుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో జాతీయ నాయకుడిగా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ఆ స్థానాన్ని ఆక్రమించే దిశగా కూడా టిడిపి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. టిడిపిలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మాత్రమే జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. గతంలో ఎన్టీ రామారావు ఉన్నా ఆ తర్వాత మరో నాయకుడు అంటూ లేకుండా పోయారు.

ఎర్రన్నాయుడు కొన్ని రోజులు పార్లమెంట్ లోను జాతీయ స్థాయిలోనూ టిడిపి తరఫున చక్రం తిప్పినా ఆయన తరువాత చంద్రబాబు నాయుడు ఆ స్థానం మరి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్థానాన్ని తిరిగి మంత్రి నారా లోకేష్ కు అప్పగిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేంద్ర మంత్రులను కలుసుకుంటున్నారు. పదేపదే వారితో చర్చిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై గ‌ళం వినిపిస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రిని కూడా ఆయన ఇండివిడ్యువల్ గా కలుసుకున్నారు. ఫ్యామిలీతో సహా కలిసి తన పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని బహుమానంగా అందించారు.

This post was last modified on June 20, 2025 2:00 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

1 hour ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago