వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అరెస్టు చేయడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. చెవిరెడ్డి అమాయకు డని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. దీనిని దారి మళ్లించేందుకే తమ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన పార్టీ నేతల అరెస్టు చిట్టాను విప్పారు.
“చెవిరెడ్డన్న అరెస్ట్ నిజంగా ఆశ్చర్యం అనిపించింది. చీమకు కూడా అపకారం చేయడం అంటే తెలీదు. అంత అమాయకుడు. అయినా.. ఆయనను అరెస్టు చేశారు. ఇది దారుణం కాదా అని చంద్రబాబును అడు తున్నా” అని జగన్ వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో తప్పుడు స్టేట్మెంటు కోసం.. గన్మన్ మదన్ను తీవ్రంగా హించారని.. ఆయనే చెప్పారని.. దీనిని బట్టి సిట్ విచారణ ఏ స్థితిలో అడ్డగోలుగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు.
“లిక్కర్ కేసులో ఎలాంటి లోపాలు జరగలేదు. కానీ, ఉద్దేశ పూర్వకంగానే కేసులు పెట్టారు. చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు.” అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఆయన పలువురి పేర్లను ఉటంకించారు. నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిపైనా కేసులు పెట్టారన్నారు. చివరకు ఆఫీసును వదిలి బయటకు కాలు కూడా పెట్టని సజ్జల రామకృష్ణారెడ్డిపైనా కేసు పెట్టారని.. ఇవన్నీ అక్రమం కాదా? అని ప్రశ్నించారు.
చంద్రగిరిలో తంతే..
చంద్రగిరిలో తంతే.. అంటూ.. చంద్రబాబు పై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రగిరిలో గెలిచే దమ్ములేక కుప్పానికి పోయాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రగిరిలో బలంగా ఉన్న ప్రజానాయకుడు కాబట్టే.. చెవవిరెడ్డి కుటుంబంపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. “వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు” అని జగన్ తెలిపారు. ఇంకా వందల మందిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
This post was last modified on June 19, 2025 4:03 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…