పార్టీ నాయకుడి కుటుంబానికి ఇచ్చిన మాట కోసం మంత్రి నారా లోకేష్ వారి ఇంటి రుణం తీర్చేశారు. అంతేకాదు.. ఆ కుటుంబానికి నెల నెలా ఆదాయం వచ్చే మార్గం కూడా చూపించారు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తోంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన టీడీపీ నేత వెన్నా బాల కోటి రెడ్డి 40 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నారు. రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఎంపీపీగా పనిచేశారు.
అయితే.. కొన్నాళ్ల కిందట ఆయన కాల్పుల్లో మృతి చెందారు. ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారన్నది ఇప్పటికీ తెలియలేదు. దీంతో ఆ కుటుంబం అనాధగా మారింది. ఇటీవల వెన్నా సతీమణి, కుమారుడు మంత్రి నారా లోకేష్ను కలుసుకుని తమ ఆవేదనను ఆయనతో పంచుకున్నారు. ఇంటిపై రుణం ఉందని.. తాము రోజు గడవక ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో చలించిపోయిన నారా లోకేష్.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో తాజాగా ఆ కుటుంబానికి ఉన్న ఇంటి రుణాన్నిపూర్తిగా తీర్చేశారు. అదేవిధంగా వెన్నా నాగేంద్రమ్మకు,.. పింఛనుతో పాటు.. పార్టీ తరఫున కూడా నెల నెలా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. తక్షణ సాయంగా కుటుంబం గడిచేందుకు వీలుగా రూ.లక్ష సాయం అందించారు. వారు ఇంటిపై తెచ్చుకున్న అప్పుమొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. పార్టీ తరఫున ఏం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దీంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on June 18, 2025 5:47 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…