Political News

అమరావతికి బూస్ట్!.. ఆ రెంటికీ కేంద్రం ఓకే!

ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఎక్కడికక్కడ నిర్మాణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. ఈ వార్త అమరావతి నిర్మాణానికి నిజంగానే బిగ్ బూస్ట్ అని చెప్పక తప్పదు. రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను తానే నిర్మించి ఇస్తానని కేంద్రం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని కొనసాగుతూ ఉంటాయి కదా. వాటిలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రమే ఆవాసం కల్పిస్తోంది. ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ ను నిర్మిస్తోంది. అదేసమయంలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మిస్తోంది. కొత్తగా పురుడు పోసుకుంటున్న అమరావతి నిర్మాణం ప్రారంభమైనప్పుడే 2014 తర్వాత ఈ రెంటి కోసం స్థలాన్ని తీసుకుని భవన నిర్మాణాలను కూడా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీసీడబ్ల్యూడీ) మొదలుపెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణంతో పాటుగా ఈ నిర్మాణాల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 

అయితే ఐధేళ్లు ఇలా గిర్రున తిరిగిపోగా… తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీ పాలనా బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే అమరావతి నిర్మాణ పనుల్లోనూ ఊపు కనిపించింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అడగంగానే కేంద్రం అన్ని పనులూ ఇట్టే చేసేస్తోంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు అప్పుగా ఇప్పించిన కేంద్రం… తాజాగా అమరావతికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ల పనులను ప్రారంబించేందుకు సిద్ధమైంది. 

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్వర్లులు జారీ చేయగా… అందుకు అయ్యే నిదులను కూడా కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం డిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన టీడీపీ యువనేత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవనాల నిర్మాణానికి రూ.1,329 కోట్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కు రూ.1,459 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. ఈ రెండింటి విలుల రూ.2,787 కోట్లుగా ఉంది. ఈ భవనాల నిర్మాణంతో ఇక అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఏ ఒక్కరి తరం కాదని చెప్పక తప్పదు. 

This post was last modified on June 17, 2025 7:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

15 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago