Political News

అమరావతికి బూస్ట్!.. ఆ రెంటికీ కేంద్రం ఓకే!

ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఎక్కడికక్కడ నిర్మాణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. ఈ వార్త అమరావతి నిర్మాణానికి నిజంగానే బిగ్ బూస్ట్ అని చెప్పక తప్పదు. రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను తానే నిర్మించి ఇస్తానని కేంద్రం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని కొనసాగుతూ ఉంటాయి కదా. వాటిలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రమే ఆవాసం కల్పిస్తోంది. ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ ను నిర్మిస్తోంది. అదేసమయంలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మిస్తోంది. కొత్తగా పురుడు పోసుకుంటున్న అమరావతి నిర్మాణం ప్రారంభమైనప్పుడే 2014 తర్వాత ఈ రెంటి కోసం స్థలాన్ని తీసుకుని భవన నిర్మాణాలను కూడా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీసీడబ్ల్యూడీ) మొదలుపెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణంతో పాటుగా ఈ నిర్మాణాల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 

అయితే ఐధేళ్లు ఇలా గిర్రున తిరిగిపోగా… తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీ పాలనా బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే అమరావతి నిర్మాణ పనుల్లోనూ ఊపు కనిపించింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అడగంగానే కేంద్రం అన్ని పనులూ ఇట్టే చేసేస్తోంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు అప్పుగా ఇప్పించిన కేంద్రం… తాజాగా అమరావతికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ల పనులను ప్రారంబించేందుకు సిద్ధమైంది. 

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్వర్లులు జారీ చేయగా… అందుకు అయ్యే నిదులను కూడా కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం డిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన టీడీపీ యువనేత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవనాల నిర్మాణానికి రూ.1,329 కోట్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కు రూ.1,459 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. ఈ రెండింటి విలుల రూ.2,787 కోట్లుగా ఉంది. ఈ భవనాల నిర్మాణంతో ఇక అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఏ ఒక్కరి తరం కాదని చెప్పక తప్పదు. 

This post was last modified on June 17, 2025 7:44 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

28 minutes ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

60 minutes ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

1 hour ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

1 hour ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

4 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

5 hours ago