Political News

‘ఇచ్చిన మాట’ నిల‌బెట్టుకున్న కూట‌మి ప్ర‌భుత్వం

‘ఆప‌రేష‌న్ సిందూర్’ స‌మ‌యంలో పాకిస్తాన్ తూటాకు బ‌లై.. వీర‌మ‌ర‌ణం పొంది, దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ తల్లీతండ్రులను ఆదుకుంటామ‌ని ఏప్రిల్‌లో జ‌రిగిన ఘ‌ట‌న అనంత‌రం.. ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ క్ర‌మంలో ఆ కుటుంబానికి 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయంతోపాటు.. ఐదు ఎక‌రాల పొలాన్ని, ఆరు సెంట్ల ఇంటి స్థ‌లాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. దీనికి సంబందించిన చెక్కు, ఇంటి, పొలం ప‌త్రాల‌ను తాజాగా మంత్రి స‌విత అందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌విత మాట్లాడుతూ.. భరతమాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ అని కొనియాడారు. దేశ ప్రజలందరి గుండెల్లో మురళీ నాయక్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. దేశ ప్రజలతో పాటు కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని వీర జవాను తల్లిదండ్రులను ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా తనను సంప్రదిస్తే వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతకుముందు కల్లితండాలోని మురళీ నాయక్ ఘాటు వద్దకెళ్లి నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. త్వరలోనే మురళీ నాయక్ నివాసం నుంచి ఘాటు వరకూ రూ.16 లక్షల వ్య‌యంతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు.

గోరంట్లతో పాటు జిల్లా కేంద్రంలో కూడా మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స‌విత తెలిపారు. కుటుంబానికి ఇచ్చిన మాట ప్ర‌కారం.. ప్ర‌భుత్వం న‌గ‌దు, ఇంటి స్థ‌లంతోపాటు పొలాన్ని కూడా కేటాయించింద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా రావాల‌ని అనుకున్నార‌ని.. కానీ, ఆయ‌న యోగాంధ్ర ప‌నుల్లో బిజీగా ఉన్న నేప‌థ్యంలో త‌న‌ను పంపించార‌ని పేర్కొన్నారు.ఇదిలావుంటే.. రెండు రోజుల కింద‌ట జ‌న‌సేన త‌ర‌ఫున తిరుప‌తి, పాల‌కొండ ఎమ్మెల్యేలు ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని క‌లిసి పార్టీ త‌ర‌ఫున 25 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం అందించారు. దీనికి ముందు వైసీపీ కూడా రూ.25 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును కుటుంబానికి అందించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూడా 25 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ఇచ్చింది.

This post was last modified on June 17, 2025 6:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

1 hour ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

2 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

4 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

4 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

5 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

5 hours ago