ఫార్ములా ఈ కారు రేసుల కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణకు వెళ్లే మెుందు బీఆర్ఎస్ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్… విచారణలంటే తనకేమీ భయం లేదని, తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటిదాకా 3 నోటీసులు ఇచ్చారని, తాను ఓ సారి విచారణకు హాజరయ్యానన్న కేటీఆర్… ఇంకా 30 నోటీసులు ఇచ్చినా తాను విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఫార్ములా ఈ కారు రేసులను హైదరాబాద్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులకు సంబంధించిన స్పాన్సరర్ నిధులు సమకూర్చుకోవాల్సి ఉన్నా… దానికి విరుద్ధంగా నాటి బీఆర్ఎస్ సర్కారు నిధులను వెచ్చించింది. అందుకు అనుగుణంగా ముందుగా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి మరీ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనిపై నాటి రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఇంటరెస్ట్ ఏమిటన్న కోణంలో ఆలోచించిన రేవంత్ రెడ్డి సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ ను ఓ దఫా విచారించింది.
తాజాగా సోమవారం విచారణకు రావాలంటూ కేటీఆర్ కు గత వారం ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణకు హాజరయ్యేందుకు ముందు నంది నగర్ లోని తన తండ్రి నివాసానికి వెళ్లిన కేటీఆర్.. కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేసీఆర్ మేనల్డుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పాలుపంచుకున్నారు. విచారణకు సంబంధించిన వ్యవహారాలపై వారు చర్చించినట్టు సమాచారం. అనంతరం పార్టీ కీలక నేతలతో కలిసి బీఆర్ఎస్ భవన్ కు వెళ్లిన కేటీఆర్ అక్కడ పార్టీ కార్యకర్తలకు అభివాదం తెలిపి.. విచారణకు బయలుదేరారు.
బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి నిర్దేశిత సమయానికే చేరుకున్న కేటీఆర్ వెంట ఆయన న్యాయవాది రామచందర్ రావును మాత్రమే అధికారులు అనుమతించారు. ఇక ఇతర లాయర్లను అనుమతించలేదు. విచారణ జరుగుతుండగా… రామచందర్ రావు అలా దూరంగా కూర్చుని చూస్తూ ఉంటారు. విచారణలో కేటీఆర్ కు ఆయన ఎలాంటి సహకారం అందించరు. ప్రస్తుతం కేటీఆర్ ముగ్గురు ఏసీబీ అధికారులతో కూడిన బృందం విచారిస్తోంది. ఈ విచారణ అనంతరం గతంలో మాదిరే కేటీఆర్ ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు అన్న మాట అయితే వినిపించలేదు.
This post was last modified on June 16, 2025 1:30 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…