బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. `లీడర్` పేరుతో ఆమె యువతకు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్ర స్తాయిలో యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి ‘లీడర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిం చారు. ఇప్పటి వరకు లేని ఈ కార్యక్రమానికి యువత నుంచి మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. అయితే.. ఈ కార్యక్రమం వెనుక చాలా పెద్ద వ్యూహమే కవిత రచించి ఉంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఆమె ప్రారంభించారు. అయితే..త్వరలోనే దీనిని జిల్లాల స్థాయికి కూడా తీసుకువెళ్లనున్నట్టు కవిత చెప్పుకొచ్చారు. ఈ శిక్షణలో భాగంగా ప్రశ్నించే తత్వాన్ని, రాజకీయాలను కూడా యువతకు నేర్పనున్నారు. వాస్తవానికి బీఆర్ ఎస్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. కేవలం కవిత నేతృత్వంలోని జాగృతి తరఫునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో ఆమె బీఆర్ ఎస్ నాయకత్వంపై ఎదురు దాడి చేస్తుండడం.. ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను దేవుడు అనడం.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమె బీఆర్ ఎస్ జెండాను పక్కన పెట్టి జాగృతి పతకాన్ని ధరిస్తుండడం.. కార్యకర్తలు, నాయకులను కలిసినప్పుడు కూడా ఇదే పంథాలో ముందుకు సాగుతుండడం వంటివి ఆమె కొత్త అజెండాకు ఏదో పునాదులు వేస్తున్నారన్న చర్చకు బలాన్నిచేకూరుస్తున్నాయి. అయితే.. దీనిపై స్పష్టత లేకపోయినా.. ప్రస్తుతం చేపట్టిన `లీడర్` కార్యక్రమం ద్వారా తన సైన్యాన్ని ఆమె స్వయంగా తీర్చిదిద్దుకుంటున్నారన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలా చేయడం ద్వారా కవిత భవితను రూపొందించుకుంటున్నారని కూడా పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇది నిజంగానే ఆమెకు బలాన్ని చేకూరుస్తుందా? లేక.. వ్యూహం ఏంటి? అనేది చూడాలి. ఏదేమైనా.. కవిత ప్రారంభించిన లీడర్ కార్యక్రమం ఏమేరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…