వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జగన్ గా రూ.. మీరు కడుపు మంటతో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్లలో కలుపుకొని తాగండి. కడుపు మంట తగ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీలకమైన సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంపథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో లోపాలు ఉన్నాయంటూ.. జగన్కు చెందిన మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రసారాలపై మంత్రి నారా లోకేష్ తనదైన రీతిలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తల్లికి వందనం పథకం అమలు తీరు జగన్ కడుపు మంటను మూడింతలు పెరిగేలా చేసిందన్నారు. అందుకే తన విష పత్రికలో నకిలీప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరికీ నిధులు అందాయని.. ఈవిషయం తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. దొంగలెక్కలు సృష్టించడం.. పేదల పేరుతో సొమ్ము కొట్టేయడం జగన్ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు.
“ఇది ప్రజా ప్రభుత్వం. జగన్ ఈ విషయం మరిచిపోయినట్టుగా ఉన్నాడు. తన ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా ఉంటుందని ఆయన అనుకుని ఉంటాడు. ప్రజా ప్రభుత్వంలో తప్పులు చేయం, ఎవరినీ చేయనివ్వం. తల్లికి వందనం సక్సెస్ కావడంతో జగన్కుకడుపు మంట పెరిగిందని అందుకే.. ఇలా తన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కడుపు మంట తగ్గించుకునేందుకు నేనే స్వయం 2 ఈనో ప్యాకెట్లను పంపిస్తా.. నీళ్లలో కలుపుకొని తాగండి.. కడుపు మంట కొంతైనా తగ్గుతుంది” అని నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on June 15, 2025 10:30 pm
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ…