Political News

జ‌గ‌న్‌.. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జ‌గ‌న్ గా రూ.. మీరు క‌డుపు మంట‌తో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్ల‌లో క‌లుపుకొని తాగండి. క‌డుపు మంట త‌గ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీల‌క‌మైన సూప‌ర్ 6 హామీల్లో ఒక‌టైన త‌ల్లికి వంద‌నంప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కంలో లోపాలు ఉన్నాయంటూ.. జ‌గ‌న్‌కు చెందిన మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్ర‌సారాల‌పై మంత్రి నారా లోకేష్ త‌న‌దైన రీతిలో స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు తీరు జ‌గ‌న్ క‌డుపు మంట‌ను మూడింత‌లు పెరిగేలా చేసింద‌న్నారు. అందుకే త‌న విష ప‌త్రిక‌లో న‌కిలీప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లులంద‌రికీ నిధులు అందాయ‌ని.. ఈవిష‌యం తెలిసి కూడా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. దొంగ‌లెక్క‌లు సృష్టించ‌డం.. పేద‌ల పేరుతో సొమ్ము కొట్టేయడం జ‌గ‌న్ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు.

“ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం. జ‌గ‌న్ ఈ విష‌యం మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నాడు. త‌న ప్ర‌భుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా ఉంటుంద‌ని ఆయ‌న అనుకుని ఉంటాడు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో త‌ప్పులు చేయం, ఎవ‌రినీ చేయ‌నివ్వం. త‌ల్లికి వంద‌నం స‌క్సెస్ కావ‌డంతో జ‌గ‌న్‌కుక‌డుపు మంట పెరిగింద‌ని అందుకే.. ఇలా త‌న మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ క‌డుపు మంట త‌గ్గించుకునేందుకు నేనే స్వ‌యం 2 ఈనో ప్యాకెట్ల‌ను పంపిస్తా.. నీళ్ల‌లో క‌లుపుకొని తాగండి.. కడుపు మంట కొంతైనా త‌గ్గుతుంది” అని నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

16 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

48 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago