Political News

జ‌గ‌న్‌.. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జ‌గ‌న్ గా రూ.. మీరు క‌డుపు మంట‌తో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్ల‌లో క‌లుపుకొని తాగండి. క‌డుపు మంట త‌గ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీల‌క‌మైన సూప‌ర్ 6 హామీల్లో ఒక‌టైన త‌ల్లికి వంద‌నంప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కంలో లోపాలు ఉన్నాయంటూ.. జ‌గ‌న్‌కు చెందిన మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్ర‌సారాల‌పై మంత్రి నారా లోకేష్ త‌న‌దైన రీతిలో స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు తీరు జ‌గ‌న్ క‌డుపు మంట‌ను మూడింత‌లు పెరిగేలా చేసింద‌న్నారు. అందుకే త‌న విష ప‌త్రిక‌లో న‌కిలీప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లులంద‌రికీ నిధులు అందాయ‌ని.. ఈవిష‌యం తెలిసి కూడా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. దొంగ‌లెక్క‌లు సృష్టించ‌డం.. పేద‌ల పేరుతో సొమ్ము కొట్టేయడం జ‌గ‌న్ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు.

“ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం. జ‌గ‌న్ ఈ విష‌యం మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నాడు. త‌న ప్ర‌భుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా ఉంటుంద‌ని ఆయ‌న అనుకుని ఉంటాడు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో త‌ప్పులు చేయం, ఎవ‌రినీ చేయ‌నివ్వం. త‌ల్లికి వంద‌నం స‌క్సెస్ కావ‌డంతో జ‌గ‌న్‌కుక‌డుపు మంట పెరిగింద‌ని అందుకే.. ఇలా త‌న మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ క‌డుపు మంట త‌గ్గించుకునేందుకు నేనే స్వ‌యం 2 ఈనో ప్యాకెట్ల‌ను పంపిస్తా.. నీళ్ల‌లో క‌లుపుకొని తాగండి.. కడుపు మంట కొంతైనా త‌గ్గుతుంది” అని నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

This post was last modified on June 15, 2025 10:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago