Political News

తేజస్వికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

మామూలుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే గెలిచిన టీంలోని ఆటగాళ్ళకే దక్కుతుంది. అలాకాదని ఓడిన టీంలోని ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిందంటే సదరు ఆటగాడు ఏ స్ధాయిలో ఆడుంటాడు ? అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇపుడు బీహార్ ఎన్నికల్లో జరిగిందిదే. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీయే కూటమినే వరిచింది. అయితే యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆర్జేడీ చీఫ్, మహాగట బంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్ మాత్రమే. అందుకనే తేజస్వీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిందంటున్నారు.

నిజానికి ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున అతిరథ మహారథులైన ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్రమంత్రులు, రాష్ట్రంలో మంత్రులు, ఎంపిలు, ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపిలు బీహార్ లో క్యాంపు వేసి ఎన్డీయే విజయానికి ప్రచారం చేశారు. ఇదే సమయంలో ఎంజీబీ తరపున ఎటు చూసినా కనిపించింది తేజస్వీ ఒక్కడు మాత్రమే. ఎన్నికల్లో తేజస్వీ చేసిన పోరాటాన్ని మహా భారతంలో అభిమన్యుడి పోరాటంతో మీడియా పోల్చటంలో అతిశయోక్తి ఏమీలేదు.

చివరకు ఎంజీబీలోని పార్టనర్స్ అయిన కాంగ్రెస్ నుండి కూడా పెద్దగా తేజస్వికి మద్దతు దొరకలేదు. 243 సీట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ 70 స్ధానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ కీలక నేత రాహూల్ గాంధి కూడా ప్రచారం చేసింది కేవలం 10 సీట్లు కూడా లేదు. అలాంటి ఆర్జేడీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసుకుంటు అలాగే కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్ధుల తరపున కూడా ప్రచారం చేసింది తేజస్వి ఒక్కరే. రోజుకు 20 బహిరంగ సభలు, రోడ్డుషోల్లో పాల్గొనటం ద్వారా తేజస్వి జనాలకు బాగా దగ్గరయ్యారు.

ఓటమి కూడా గౌరప్రదంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్డీయే కూటమికి 125 సీట్లు వస్తే ఎంజీబీకి 110 సీట్లు రావటం అంటే మామూలు విషయం కాదు. గెలిచుంటే 31 ఏళ్ళల్లోనే ముఖ్యమంత్రయి చరిత్ర సృష్టించే వారేమో. అయితే ఆ అవకాశం తృటిలో తప్పిపోయినా వచ్చే ఎన్నికల్లో గ్యారెంటిగా అధికారంలోకి వస్తామనే ధీమాను ఆర్జేడీ వ్యక్తం చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సలహాలిచ్చి నడిపించేందుకు తండ్రి, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లేరు. వ్యూహాలు రచించి అమలుల్లో పెట్టటానికి మరో నేత సహకారమే లేదు.

వ్యూహాలు రచించాల్సింది, వాటిని అమలు చేయాల్సింది కూడా తేజస్వి మాత్రమే. అందుకనే ఈ ఎన్నికలు తేజస్విని బాగా రాటు దాల్చే ఉంటాయి. ప్రత్యర్ధి పార్టీల్లో ఎవరేంటి, పార్టనర్స్ లో కూడా ఎవరేమిటి అనే విషయం ఈ పాటికే బాగా అర్ధమైపోయుంటుంది. కాబట్టి ఇపుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన వ్యక్తే రేపటి ఎన్నికల్లో టీంను గెలిపిస్తారేమో చూడాలి.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

7 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

7 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

8 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

9 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

9 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

9 hours ago