గత ఏడాది ఎన్నికల్లో వైసీపీకి 40 శాతానికి అటు ఇటుగా ఓటు బ్యాంకు వచ్చింది. ఇది పార్టీ ఓడిపోయినప్ప టికీ.. అసలు పార్టీలో జవసత్వాలు తగ్గలేదని చెప్పడానికి.. పార్టిక ప్రజలు అండగా ఉన్నారని అనేందుకు ఒక ఉదాహరణ. అయితే.. ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత.. ప్రస్తుతం వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా? పెరిగిందా? అనేది కీలక అంశం. ఎప్పటికప్పుడు కొలుచుకునే సంస్కృతి వైసీపీకి లేకపోయినా.. రాజకీయ వర్గాల్లో మాత్రం వైసీపీపై భారీ అంచనాలు.. లెక్కలు కనిపిస్తున్నాయి.
ఈ పరంగా చూసుకుంటే.. వైసీపీకి ఓటు బ్యాంకు స్థిరంగా లేదన్న విషయం తెలుస్తోంది. తాజాగా కొందరు చేసిన సర్వేలే కాకుండా.. టీడీపీ అనుకూల వర్గాలు చేయించిన సర్వేల్లోనూ.. వైసీపీ ఓటు బ్యాంకు స్థిరంగా లేదని తెలుస్తోంది. గత ఏడాది 40 శాతం ఓటు బ్యాంకుతో ప్రతిపక్షానికి పరిమితమైన వైసీపీ.. కేవలం 4-5 శాతం ఓటు బ్యాంకు తేడాతోనే అధికారం కోల్పోయింది. మరి ఆ మేరకు ప్రస్తుతం ఓటు బ్యాంకు పెరిగిందా? అంటే సందేహమే. ఎందుకంటే. ఏడాదిలో వైసీపీ పెద్దగా పుంజుకోలేదు.
పైగా.. ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమం నిర్మించడంలోనూ.. విఫలమైంది. ప్రజల తరఫున గళం వినిపించడం లోనూ.. పార్టీ వెనుకబడింది. ఇవన్నీ ఇలా ఉంటే.. జగన్ వ్యవహరించిన తీరు కూడా.. ప్రజలు ఏవగించుకునే పరిస్థితిని తీసుకువచ్చింది. అసెంబ్లీకి వెళ్లకుండా మంకు పట్టు పట్టడం.. మెజారిటీ ప్రజలకు విస్మయం కలిగించడంతోపాటు..”ఈయన మారడు” అనేది జగన్కు పడి ముద్రగా మారింది. వాస్తవానికి.. ఎన్నికల అనంతరం మార్పు తధ్యమని అనుకున్నారు.
కానీ, ఆ మార్పు జగన్లో ఎక్కడా కనిపించలేదు. పైగా.. నాయకులు వీడిపోవడం.. పార్టీలో లుకలుకలు.. ఎన్నికల అనంతరం.. అందరూ జగన్ వైపే తప్పులు చూపించడం వంటివి కూడా పార్టీని జారుబండపై కూర్చోబెట్టాయి. మరోవైపు.. ఏ సమస్యను కూడా.. ఆయన ప్రజల మద్యకు కాకుండా.. కేవలం సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకుని ముందుకు రావడం గమనార్హం. దీంతో వైసీపీ గ్రాఫ్ కన్నా కూడా.. ఓటు బ్యాంకు ప్రస్తుతం 2-4 శాతం మేరకు తగ్గిందన్నది తాజా అంచనా. ఇది పెద్దది కాదని వైసీపీ మౌనంగా ఉంటే.. మున్ముందు.. వాటి పక్కన సున్నాలు చేరినా ఆశ్చర్యంలేదు.
This post was last modified on June 12, 2025 5:24 pm
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…