Political News

వైసీపీలో 65 శాతం మంది కోరిక ఇదేనా .. !

రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి.. ఏడాది పూర్త‌యింది. ఈ క్ర‌మంలో అటు ప్ర‌బుత్వానికి ఎంత‌గా కీల‌క‌మో.. ఇటు ప్ర‌తిప‌క్షంగా కూడా.. ఈ స‌మ‌యం వైసీపీకి ఆ పార్టీ అధినేతకు అంతే కీల‌కం. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు. ఎవ‌రికైనా ఈ ఏడాది కాలంలో గ్రాఫ్ ఎలా ఉంద‌న్న‌ది ముఖ్యం. దీనిపై అధికార పార్టీ ప‌లు రూపాల్లో స‌ర్వేలు చేయించుకుంటోంది. ప్ర‌జ‌ల నాడి తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేస్తోంది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. స‌ర్వేలంటూ ప్ర‌త్యేకంగా చేయ‌డం లేదు.

అయితే.. ఎలానూ సొంత‌ మీడియా ఉన్న నేప‌థ్యంలో ఆ రూపంలో అభిప్రాయ సేక‌ర‌ణ జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా ఏడాది పాల‌న‌పై ఎక్క‌డా స‌ర్వేచేయించ‌లేదు. ఇక‌, సొంత‌గా మీడియా నుంచి రాబ‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం.. వైసీపీలో ఉన్న నాయ‌కులు.. కీల‌క‌మైన అంశాల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌ధానంగా.. జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లాల‌ని కోరుకుంటున్న వైసీపీ నాయ‌కులు 65 శాతం మంది ఉన్నార‌న్న‌ది తాజా లెక్క‌. ఇది వాస్త‌వం.

కానీ.. దీనిని న‌మ్మడం క‌ష్ట‌మే అయినా.. పార్టీలో మాత్రం ఈత‌ర‌హా చ‌ర్చే ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల త‌ర‌ఫున బాణి వినిపించేందుకు జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లాల‌ని చాలా మంది కోరుతున్నారు. మ‌రికొంద‌రు అటు జ‌నంలోకి .. ఇటు అసెంబ్లీకి కూడా రావ‌డం వ‌ల్లే జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నా రు. ఇలా.. కీల‌క‌మైన ఈ విష‌యంపై నాయకులు స్ప‌ష్టంగానే చెబుతున్నారు. స్ప‌ష్ట‌త‌తోనే చెబుతున్నారు. కానీ.. జ‌గ‌న్ మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు వచ్చేది లేద‌ని అంటున్నారు.

మ‌రో కీల‌క అంశం.. ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డం. ఈ విష‌యంలోనూ.. జ‌గ‌న్ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించా ల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నారు. దీనికి కూడా65 – 70 శాతం మంది నాయ‌కులు ఇదే భావ‌న‌తో ఉన్నారు. స‌వాళ్లు రువ్వ‌డం.. బెదిరింపుల‌కు గురి చేయ‌డం.. పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివాటిని గ‌ర్హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గన్ యాట్టిట్యూడ్ మారాల‌ని కోరుకునే వారు కూడా క‌నిపిస్తు న్నారు. మొత్తానికి రెండు అంశాల‌పై వైసీపీ నాయ‌కులు క్లారిటీ ఇచ్చేశారు. 

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

29 minutes ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

1 hour ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

1 hour ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

1 hour ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

3 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago