రాష్ట్రంలో ఎన్నికలు జరిగి.. ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో అటు ప్రబుత్వానికి ఎంతగా కీలకమో.. ఇటు ప్రతిపక్షంగా కూడా.. ఈ సమయం వైసీపీకి ఆ పార్టీ అధినేతకు అంతే కీలకం. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఎవరికైనా ఈ ఏడాది కాలంలో గ్రాఫ్ ఎలా ఉందన్నది ముఖ్యం. దీనిపై అధికార పార్టీ పలు రూపాల్లో సర్వేలు చేయించుకుంటోంది. ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. సర్వేలంటూ ప్రత్యేకంగా చేయడం లేదు.
అయితే.. ఎలానూ సొంత మీడియా ఉన్న నేపథ్యంలో ఆ రూపంలో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ప్రత్యేకంగా ఏడాది పాలనపై ఎక్కడా సర్వేచేయించలేదు. ఇక, సొంతగా మీడియా నుంచి రాబడుతున్న సమాచారం ప్రకారం.. వైసీపీలో ఉన్న నాయకులు.. కీలకమైన అంశాలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా.. జగన్ అసెంబ్లీకి వెళ్లాలని కోరుకుంటున్న వైసీపీ నాయకులు 65 శాతం మంది ఉన్నారన్నది తాజా లెక్క. ఇది వాస్తవం.
కానీ.. దీనిని నమ్మడం కష్టమే అయినా.. పార్టీలో మాత్రం ఈతరహా చర్చే ఎక్కువగా జరుగుతోంది. ప్రజల తరఫున బాణి వినిపించేందుకు జగన్ అసెంబ్లీకి వెళ్లాలని చాలా మంది కోరుతున్నారు. మరికొందరు అటు జనంలోకి .. ఇటు అసెంబ్లీకి కూడా రావడం వల్లే జగన్కు ప్రజల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నా రు. ఇలా.. కీలకమైన ఈ విషయంపై నాయకులు స్పష్టంగానే చెబుతున్నారు. స్పష్టతతోనే చెబుతున్నారు. కానీ.. జగన్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వచ్చేది లేదని అంటున్నారు.
మరో కీలక అంశం.. ప్రత్యర్థులను టార్గెట్ చేయడం. ఈ విషయంలోనూ.. జగన్ ఆచి తూచి వ్యవహరించా ల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దీనికి కూడా65 – 70 శాతం మంది నాయకులు ఇదే భావనతో ఉన్నారు. సవాళ్లు రువ్వడం.. బెదిరింపులకు గురి చేయడం.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివాటిని గర్హిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ యాట్టిట్యూడ్ మారాలని కోరుకునే వారు కూడా కనిపిస్తు న్నారు. మొత్తానికి రెండు అంశాలపై వైసీపీ నాయకులు క్లారిటీ ఇచ్చేశారు.
This post was last modified on June 11, 2025 9:24 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…