ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తాలూకు నష్టాన్ని పూడ్చుకుంటూ…మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేయడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హామీపై చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.
తల్లికి వందనం పథకంలో భాగంగా రేపు పిల్లల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇంట్లో అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు చొప్పున నిధులు రేపు విడుదల చేయనున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 15 వేల రూపాయలు చొప్పున వారి తల్లి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలు కోసం తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు చంద్రబాబు సర్కార్ జమ చేయనుంది. ఏపీలో రేపటి నుంచి విద్యా సంవత్సరం మొదలుకానున్న సంగతి తెలిసిందే. వేసవి సెలవుల తర్వాత జూన్ 12న రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఫీజులు బెడద లేకుండా మొదటి రోజే తల్లికి వందనం పథకం అమలు చేయాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రారంభం కానున్న మొదటి రోజే ఫీజు చెల్లించడంతో తాము చీకు చింత లేకుండా చదువుకుంటామని పిల్లలు అంటున్నారు. ఈ పథకం సరైన సమయంలో అమలు చేస్తున్న చంద్రబాబుకు పిల్లలు , వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
This post was last modified on June 11, 2025 5:54 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…