Political News

బిగ్ బ్రేకింగ్: ఏలూరులో దగ్ధమైంది సాక్షి ఆఫీసు కాదు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సాక్షి మీడియాపై ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల సాక్షి పత్రిక ప్రతులను నిరసనకారులు తగులబెట్టారు. అదే క్రమంలో ఏలూరులోని సాక్షి ఆఫీసుపై కొందరు మహిళలు దాడి చేశారని, ఆఫీసులో ఫర్నిచర్ దగ్ధం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, దగ్దమైంది సాక్షి కార్యాలయం కాదని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తాజాగా వెల్లడించారు.

ఓ ఫర్నిచర్ షాపుకు చెందిన గోదాంలో మరమ్మతు ఫర్నిచర్ మాత్రమే దగ్దమైందని శ్రవణ్ కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిందని ఫర్నిచర్ షాప్ యజమాని తమకు ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామని వెల్లడించారు. మంటలను అదుపు చేస్తున్న సమయంలో దెందులూరు నుంచి వచ్చిన మహిళలు అక్కడకు వచ్చారని తెలిపారు. ఆ ఘటన సమయంలో తీసిన వీడియోలలో ఆ విషయం స్పష్టమవుతోందని చెప్పారు.

ఆ అగ్ని ప్రమాదానికి, సాక్షి కార్యాలయానికి సంబంధం లేదని, ఆ మంటలు ఎగిసిపడుతున్న సమయంలో మహిళలు చేస్తున్న ర్యాలీ 200 మీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు. ఆ అగ్ని ప్రమాదం సాక్షి ఆఫీసులోనే అంటూ దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొన్ని ఛానల్స్ లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.

This post was last modified on June 11, 2025 9:30 am

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

36 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

51 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

52 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago