Political News

బిగ్ బ్రేకింగ్: ఏలూరులో దగ్ధమైంది సాక్షి ఆఫీసు కాదు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సాక్షి మీడియాపై ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల సాక్షి పత్రిక ప్రతులను నిరసనకారులు తగులబెట్టారు. అదే క్రమంలో ఏలూరులోని సాక్షి ఆఫీసుపై కొందరు మహిళలు దాడి చేశారని, ఆఫీసులో ఫర్నిచర్ దగ్ధం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, దగ్దమైంది సాక్షి కార్యాలయం కాదని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తాజాగా వెల్లడించారు.

ఓ ఫర్నిచర్ షాపుకు చెందిన గోదాంలో మరమ్మతు ఫర్నిచర్ మాత్రమే దగ్దమైందని శ్రవణ్ కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిందని ఫర్నిచర్ షాప్ యజమాని తమకు ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామని వెల్లడించారు. మంటలను అదుపు చేస్తున్న సమయంలో దెందులూరు నుంచి వచ్చిన మహిళలు అక్కడకు వచ్చారని తెలిపారు. ఆ ఘటన సమయంలో తీసిన వీడియోలలో ఆ విషయం స్పష్టమవుతోందని చెప్పారు.

ఆ అగ్ని ప్రమాదానికి, సాక్షి కార్యాలయానికి సంబంధం లేదని, ఆ మంటలు ఎగిసిపడుతున్న సమయంలో మహిళలు చేస్తున్న ర్యాలీ 200 మీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు. ఆ అగ్ని ప్రమాదం సాక్షి ఆఫీసులోనే అంటూ దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొన్ని ఛానల్స్ లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.

This post was last modified on June 11, 2025 9:30 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

2 hours ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

6 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

10 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

11 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

12 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

12 hours ago