బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్తో ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బుధవారం ఉదయం 6 గంటల సమయానికే ఆమె.. తన భర్త అనిల్తో కలిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి కలిశారు. అయితే.. ఇక్కడ రెండు విషయాలు చర్చకు వస్తున్నాయి. కేసీఆర్కు ‘డియర్ డాడీ’ అంటూ.. కవిత రాసిన లేఖ సంచలనం సృష్టించిన తర్వాత.. తొలిసారి ఆమె ఆయనతో భేటీ అయ్యారు. ఆ లేఖ రాసిన తర్వాత.. అమెరికాకు వెళ్లిన ఆమె.. అనంతరం.. ఈ లేఖ లీకు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా నుంచి తిరిగి వస్తూనే.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. కూడా ఆమె సూటి పోటి మాటలతో పార్టీని ఇరుకున పడేశారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అదేవిధంగా తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. పార్టీలో ట్వీట్లు చేసేందుకు పరిమితమయ్యారంటూ.. కాంగ్రెస్పై పోరాటం ఏదని కూడా ప్రశ్నించారు.
ఇక, 2వ విషయానికి వస్తే.. తాజాగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిన సమయంలో అనూహ్యంగా కవిత ఆయనతో భేటీ కావడం. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు కవితకు ఎలాంటి సంబం ధం లేకపోయినా.. కేసీఆర్ కోసం నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు ఆమె హుటాహుటిన కేసీఆర్ వద్దకు చేరుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా.. లేఖ అనంతరం బీఆర్ ఎస్లో ఏర్పడిన రాజకీయ పరిణామాలు.. తదనంతర కాలంలో జరిగిన ఘటనల అనంతరం.. కేసీఆర్ను కవిత కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంపై ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ వద్దకు కేసీఆర్ నేరుగా హాజరు కాకుండా(బహిరంగ విచారణ) ఆయనకు వీడియో విచారణకు అవకాశం కల్పించినట్టు తెలిసింది.
This post was last modified on June 11, 2025 9:21 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…