Political News

కేసీఆర్‌తో క‌విత భేటీ.. లేఖ త‌ర్వాత తొలిసారి!

బీఆర్ఎస్ అధినేత‌, త‌న తండ్రి కేసీఆర్‌తో ఆ పార్టీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత భేటీ అయ్యారు. బుధవారం ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యానికే ఆమె.. త‌న భ‌ర్త అనిల్‌తో క‌లిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి క‌లిశారు. అయితే.. ఇక్క‌డ రెండు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కేసీఆర్‌కు ‘డియ‌ర్ డాడీ’ అంటూ.. క‌విత రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టించిన త‌ర్వాత‌.. తొలిసారి ఆమె ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఆ లేఖ రాసిన త‌ర్వాత‌.. అమెరికాకు వెళ్లిన ఆమె.. అనంత‌రం.. ఈ లేఖ లీకు చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అమెరికా నుంచి తిరిగి వ‌స్తూనే.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ దేవుడ‌ని.. ఆయ‌న చుట్టూ దెయ్యాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత‌.. కూడా ఆమె సూటి పోటి మాట‌ల‌తో పార్టీని ఇరుకున ప‌డేశారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అదేవిధంగా త‌న‌పై వ్య‌తిరేక ప్రచారం చేస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు. పార్టీలో ట్వీట్లు చేసేందుకు ప‌రిమిత‌మ‌య్యారంటూ.. కాంగ్రెస్‌పై పోరాటం ఏద‌ని కూడా ప్ర‌శ్నించారు.

ఇక‌, 2వ విష‌యానికి వ‌స్తే.. తాజాగా కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందు కేసీఆర్ హాజ‌రు కావాల్సిన స‌మ‌యంలో అనూహ్యంగా క‌విత ఆయ‌న‌తో భేటీ కావ‌డం. వాస్త‌వానికి కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు క‌విత‌కు ఎలాంటి సంబం ధం లేక‌పోయినా.. కేసీఆర్ కోసం నిర‌స‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు ఆమె హుటాహుటిన కేసీఆర్ వ‌ద్ద‌కు చేరుకున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏదేమైనా.. లేఖ అనంత‌రం బీఆర్ ఎస్‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ ప‌రిణామాలు.. త‌ద‌నంత‌ర కాలంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల అనంత‌రం.. కేసీఆర్‌ను క‌విత క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ విష‌యంపై ఏం జ‌రుగుతుందో చూడాలి. మ‌రోవైపు.. కాళేశ్వ‌రం క‌మిష‌న్ వ‌ద్ద‌కు కేసీఆర్ నేరుగా హాజ‌రు కాకుండా(బ‌హిరంగ విచార‌ణ‌) ఆయ‌న‌కు వీడియో విచార‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలిసింది.

This post was last modified on June 11, 2025 9:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

4 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

6 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

6 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

7 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

8 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

10 hours ago