Political News

‘రాజ‌ధాని మ‌హిళ‌ల’ విష‌యం.. బీజేపీకి ప‌ట్ట‌లేదా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆ త‌ర‌హా మ‌హిళ‌లు ఉంటారంటూ.. వైసీపీ మీడియా సాక్షిలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై మ‌హిళాలోకం భ‌గ్గు మంటోంది. దీనిపై పెద్ద ఎత్తున మ‌హిళ‌లు కూడా ఉద్యమాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సాక్షి కార్యాలయాలు వద్ద ఆందోళన నిర్వహించారు. యాంక‌ర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వేడి ఇంకా చల్లారలేదు.

అయితే ఈ వ్యవహారంపై పార్టీలకు అతీతంగా ఒక వైసీపీ తప్ప మిగిలిన నాయకులు అందరూ స్పందిస్తున్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పర్యటించిన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. పైగా అసలు తమకు తెలియనట్టే వ్యవహరించడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యతాయుతమైన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అమరావతి రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం కనీసం తప్పు పట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి బిజెపి నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు మహిళలు కూడా కోరుకుంటున్నారు. తద్వారా సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.

కచ్చితంగా ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పర్యటించిన నాయకులు ఈ వ్యవహారం పై మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. అయితే ప్రధానమంత్రి మోడీ పాలనపై ప్రశంసలు గుప్పించ‌డానికి మాత్రమే పరిమితమయ్యారు తప్ప రాజధాని మహిళలపై సాక్షి మీడియా ఛానల్లో వచ్చిన వ్యాఖ్యలపై మాత్రం వారు స్పందించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని బిజెపి ఇలాంటి వాటికి మద్దతిస్తుందా? లేక విభేదిస్తుందా? అనేది స్పష్టం చేయాలని అమరావతి మహిళలు కోరుతున్నారు.

This post was last modified on June 10, 2025 3:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

47 minutes ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

51 minutes ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

3 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

4 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

4 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

5 hours ago