సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియా యాంకర్గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి స్థానిక కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీనికి ముందు మంగళవారం ఉదయం వరకు.. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్లోనే ఉంచిన ఆయనను.. తర్వాత.. గుంటూరుకు తరలించారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. సుమారు గంటకు పైగా.. ఇక్కడే సమయం సరిపోయింది.
అనంతరం.. కొమ్మినేని ఆరోగ్యం బాగానే ఉందని.. స్వల్పంగా రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. దీనిని తీసుకుని పోలీసులు మంగళగిరి కోర్టులో ఆయనను హాజరు పరిచారు. దీనిని పరిశీలించిన కోర్టు.. 14 రోజలు రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు నమోదు చేశామని.. బెయిల్ ఇవ్వరాదని కోరారు.
వాస్తవానికి అప్పటికి కొమ్మినేని తరఫున న్యాయవాదులు ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇంతలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని పక్కన పెట్టిన కోర్టు రిమాండ్ విధించింది. అమరావతి మహిళలపై ఓ వ్యాఖ్యాత తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమయంలో సాక్షి మీడియా యాంకర్గా ఉండి.. ఆ డిబేట్ను నిర్వహిస్తున్న కొమ్మినేని ఆ వ్యాఖ్యలను నిలువరించలేదని.. పైగా ప్రోత్సహించేలా వ్యాఖ్యానించారని.. తుళ్లూరుకు చెందిన కంభంపాటి శిరీష్ అనే దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొమ్మినేని సహా సాక్షి, వ్యాఖ్యాతలపై కేసులు నమోదు చేశారు.
This post was last modified on June 10, 2025 3:20 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…