Political News

తెలంగాణ ప్ర‌భుత్వం… బియ్యం వ్యాపారం!

ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మాత్ర‌మే ఉండాల‌న్న‌ది ఒకప్ప‌టి మాట‌. అయితే.. త‌ర‌చుగా ప్ర‌ధాని మోడీ కూడా ఇదే మాట చెబుతారు. వ్యాపారం చేసేందుకు మేం లేమంటూ.. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌ల‌లో వాటాను వెన‌క్కి తీసుకుంటున్నారు. అయితే.. కాలానికి అనుగుణంగా మార్పులు ఎలా కీల‌క‌మో.. ప్ర‌భుత్వాలు కూడా అంతే. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు.. కూడా వ్యాపారాల‌ను చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగానికి, ఆతిథ్య రంగానికి కూడా.. ప్ర‌భుత్వాలు పెద్ద‌పీట వేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం బియ్యం వ్యాపారంలోకి అడుగు పెట్ట‌నుంది. గ‌తంలో మోడీ తీసుకువ‌చ్చిన ‘భార‌త్ బ్రాండ్‌’ బియ్యం త‌ర‌హాలోనే.. తెలంగాణ‌లోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ‘తెలంగాణ బ్రాండ్ రైస్‌’ పేరిట బ‌హిరంగ మార్కెట్‌లో బియ్యాన్ని విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి వ్యాపార వేత్త‌ల‌తో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో స‌న్న‌ర‌కాల బియ్య పంట పెరిగింది. దీంతో ఉత్ప‌త్తి కూడా అంతే వ‌చ్చింది.

కానీ, అవ‌స‌రాల‌కు పోను.. మిగిలిన మొత్తాన్ని ఏం చేయాల‌న్న విష‌యం స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసింది. గ‌త నెల నుంచి పేద‌ల‌కు రేష‌న్ కార్డుపై స‌న్న‌బియ్యాన్నే ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది పోను.. మిగిలిన బియ్యాన్ని 5-10-20 కేజీల రూపంలో ప్యాక్ చేయించి.. తెలంగాణ బ్రాండ్ పేరుతో బ‌హిరంగ మార్కెట్‌లో విక్ర‌యించేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. వీటిలో ‘జైశ్రీరాం’, ఆర్ఎస్ఆర్ ర‌కాల బియ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. వీటిని ఎక్కువ మంది తింటున్న నేప‌థ్యంలో ఈ బ్రాండ్ల‌కు మార్కె ట్ బాగుంటుంద‌ని భావిస్తున్నారు.

ఇక‌, ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే.. లాభాపేక్ష లేకుండానే ప్ర‌భుత్వం వీటిని విక్ర‌యించాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతానికి అయితే.. బ‌హిరంగ మార్కెట్‌లో కిలో స‌న్న‌బియ్యం 70 రూపాల‌కు త‌క్కువ లేదు. కొన్ని చోట్ల రూ.100 కూడా ప‌లుకుతున్నాయ‌ని ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో స‌ర‌మైన ధ‌ర‌ల‌కు.. స‌న్న‌బియ్యాన్ని ప్యాక్‌లుగా చేయించి విక్ర‌యించాల‌న్న త‌లంపులో ప్ర‌భుత్వం ఉంది. కానీ, దీనికి మిల్ల‌ర్లు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. రాష్ట్రంలోని మెజారిటీ మిల్ల‌ర్లు.. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 8, 2025 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago