Illustrative picture of coronavirus vaccine under trail
ఇదిగో వ్యాక్సిన్.. అదిగో వ్యాక్సిన్ అనుకుంటూనే ఉన్నాం. నెలలు నెలలు గడిచిపోతున్నాయి. కానీ ఎంతకీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావట్లేదు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లకు ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయని.. అన్ని రకాల అనుమతులూ వచ్చేశాయని.. సామాన్య జనం మీద కూడా ప్రయోగించేశారని వార్తలు వచ్చాయి కానీ.. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆమోదం పొందే దిశగా ఏ వ్యాక్సిన్ అడుగులేసినట్లు కనిపించలేదు.
ప్రఖ్యాత కంపెనీలేవీ వ్యాక్సిన్ విషయంలో అన్ని దశలనూ దాటి ముందంజ వేసినట్లు సంకేతాలేమీ అందలేదు. దీంతో 2020లో వ్యాక్సిన్ కలే అన్న అభిప్రాయం వచ్చేసింది. ఇలాంటి తరుణంలో ఫార్మాసూటికల్ జెయింట్, కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న ఫిజర్ ఓ తీపి కబురు చెప్పింది.
తాము తయారు చేసిన కొత్త కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం మేర వైరస్ ఇన్ఫెక్షన్లన్నింటినీ నయం చేసినట్లు ఫిజర్ ప్రకటించింది. ఫిజర్ తయారు చేసిన వ్యాక్సిన్ రెండు డోస్లను 43 వేల మంది వాలంటీర్లకు ఇచ్చారు. అందులో కోవిడ్ ఉన్న 94 మందిలో వ్యాక్సిన్ ప్రభావాన్ని అధ్యయనం చేసిన అనంతరం.. వైరస్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్లు 90 శాతం నయం అయినట్లుగా ఫిజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇచ్చామని.. రెండో డోస్ ఇచ్చిన ఏడు రోజుల వరకు రోగికి అది సంరక్షణగా నిలిచిందని ఫిజర్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అత్యావశ్యకమైన వ్యాక్సిన్ను అందజేసి వైరస్ ఉత్పాతానికి తెరదించే దిశగా తమ సంస్థ కీలక ముందడుగు వేసిందని ఫిజర్ సీసీఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపాడు. తమ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలన్నింటికీ సాధ్యమైంత త్వరగా సరఫరా చేయాలని ఫిజర్ పట్టుదలతో ఉంది.
This post was last modified on November 10, 2020 1:37 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…