Illustrative picture of coronavirus vaccine under trail
ఇదిగో వ్యాక్సిన్.. అదిగో వ్యాక్సిన్ అనుకుంటూనే ఉన్నాం. నెలలు నెలలు గడిచిపోతున్నాయి. కానీ ఎంతకీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావట్లేదు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లకు ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయని.. అన్ని రకాల అనుమతులూ వచ్చేశాయని.. సామాన్య జనం మీద కూడా ప్రయోగించేశారని వార్తలు వచ్చాయి కానీ.. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆమోదం పొందే దిశగా ఏ వ్యాక్సిన్ అడుగులేసినట్లు కనిపించలేదు.
ప్రఖ్యాత కంపెనీలేవీ వ్యాక్సిన్ విషయంలో అన్ని దశలనూ దాటి ముందంజ వేసినట్లు సంకేతాలేమీ అందలేదు. దీంతో 2020లో వ్యాక్సిన్ కలే అన్న అభిప్రాయం వచ్చేసింది. ఇలాంటి తరుణంలో ఫార్మాసూటికల్ జెయింట్, కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న ఫిజర్ ఓ తీపి కబురు చెప్పింది.
తాము తయారు చేసిన కొత్త కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం మేర వైరస్ ఇన్ఫెక్షన్లన్నింటినీ నయం చేసినట్లు ఫిజర్ ప్రకటించింది. ఫిజర్ తయారు చేసిన వ్యాక్సిన్ రెండు డోస్లను 43 వేల మంది వాలంటీర్లకు ఇచ్చారు. అందులో కోవిడ్ ఉన్న 94 మందిలో వ్యాక్సిన్ ప్రభావాన్ని అధ్యయనం చేసిన అనంతరం.. వైరస్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్లు 90 శాతం నయం అయినట్లుగా ఫిజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇచ్చామని.. రెండో డోస్ ఇచ్చిన ఏడు రోజుల వరకు రోగికి అది సంరక్షణగా నిలిచిందని ఫిజర్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అత్యావశ్యకమైన వ్యాక్సిన్ను అందజేసి వైరస్ ఉత్పాతానికి తెరదించే దిశగా తమ సంస్థ కీలక ముందడుగు వేసిందని ఫిజర్ సీసీఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపాడు. తమ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలన్నింటికీ సాధ్యమైంత త్వరగా సరఫరా చేయాలని ఫిజర్ పట్టుదలతో ఉంది.
This post was last modified on November 10, 2020 1:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…