Political News

నీరుకోసం భారత్ ఎదుట వేడుకుంటున్న పాకిస్థాన్!

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూనే మరోవైపు నీటి కోసం విజ్ఞప్తులు చేయడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం. భారత్ తీసుకున్న కీలక నిర్ణయం.. సింధూ జలాల సరఫరా నిలిపివేయడమే. ఇప్పుడు పాకిస్థాన్‌ను గట్టిగా వణికిస్తోంది. తమ దేశ ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఇప్పటికే నాలుగు లేఖలు భారత్‌కు పంపింది.

తాజాగా మే నెల ఆరంభంలో ప్రారంభమైన ఈ లేఖల పరంపర, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రతను సంతరించుకుంది. పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు వచ్చిన ఈ లేఖలన్నీ ఒకే ఉద్దేశంతో.. సింధూ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరాయి. భారత్ మాత్రం ప్రస్తుతం చర్చలలో ఆసక్తి చూపకపోవడమే కాకుండా, ప్రోటోకాల్ ప్రకారం ఈ లేఖలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మార్చింది.

భారత ప్రధాని మోదీ గతంలో స్పష్టంగా చెప్పారు – “రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవు.” అంటే ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయకుండా, భారత్‌పై దాడులకు వెనక నుంచి తోడ్పాటును కొనసాగిస్తూనే… నీటి కోసం కరుణాపూర్వకంగా లేఖలు రాయడం అసహ్యకరమని భావిస్తున్నారు విశ్లేషకులు.

1960లో ప్రపంచ బ్యాంకు మద్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందంలో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. పశ్చిమ నదులైన సింధూ, జీలం, చీనాబ్‌పై పాకిస్థాన్‌కు హక్కులు అప్పట్లో ఇచ్చారు. కానీ కాలం మారింది… పరిస్థితులు మారాయి. పాకిస్థాన్ వైఖరి వల్లే ఇప్పుడు ఈ ఒప్పంద భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

This post was last modified on June 6, 2025 7:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

2 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

2 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

2 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

3 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

3 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

4 hours ago