Political News

నీరుకోసం భారత్ ఎదుట వేడుకుంటున్న పాకిస్థాన్!

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూనే మరోవైపు నీటి కోసం విజ్ఞప్తులు చేయడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం. భారత్ తీసుకున్న కీలక నిర్ణయం.. సింధూ జలాల సరఫరా నిలిపివేయడమే. ఇప్పుడు పాకిస్థాన్‌ను గట్టిగా వణికిస్తోంది. తమ దేశ ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఇప్పటికే నాలుగు లేఖలు భారత్‌కు పంపింది.

తాజాగా మే నెల ఆరంభంలో ప్రారంభమైన ఈ లేఖల పరంపర, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రతను సంతరించుకుంది. పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు వచ్చిన ఈ లేఖలన్నీ ఒకే ఉద్దేశంతో.. సింధూ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరాయి. భారత్ మాత్రం ప్రస్తుతం చర్చలలో ఆసక్తి చూపకపోవడమే కాకుండా, ప్రోటోకాల్ ప్రకారం ఈ లేఖలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మార్చింది.

భారత ప్రధాని మోదీ గతంలో స్పష్టంగా చెప్పారు – “రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవు.” అంటే ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయకుండా, భారత్‌పై దాడులకు వెనక నుంచి తోడ్పాటును కొనసాగిస్తూనే… నీటి కోసం కరుణాపూర్వకంగా లేఖలు రాయడం అసహ్యకరమని భావిస్తున్నారు విశ్లేషకులు.

1960లో ప్రపంచ బ్యాంకు మద్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందంలో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. పశ్చిమ నదులైన సింధూ, జీలం, చీనాబ్‌పై పాకిస్థాన్‌కు హక్కులు అప్పట్లో ఇచ్చారు. కానీ కాలం మారింది… పరిస్థితులు మారాయి. పాకిస్థాన్ వైఖరి వల్లే ఇప్పుడు ఈ ఒప్పంద భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

This post was last modified on June 6, 2025 7:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

24 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

46 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago