చూసి నేర్చుకునే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సాటి మరెవరూ లేరు. ఆయన ఎక్కడా చిన్న బుచ్చుకోరు కూడా. ఏ స్థాయిలో ఉన్నా.. ఆయన గత అనుభవాలను నెమరు వేసుకుంటారు. పొరుగు వ్యక్తులను కూడా చూసి.. ఎలా ఉండాలో .. ఎలా ఉండకూడదో నేర్చుకోవడంలోనూ ఆయన వెనుకంజ వేయరు. ముఖ్యంగా వైసీపీ హయాంను కళ్లారా చూసిన చంద్రబాబు.. ఎలా ఉండకూడదో నేర్చుకుంటు న్నారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నాలుగు కీలక విషయాల్లో.. చంద్రబాబు నిర్ణయాలు ఆసక్తిగా మారాయి. 1) సలహాదారులు.. ఈ విషయంలో వైసీపీ అధినేతకు ఎదురైన అనుభవాలు.. ఇప్పుడు చంద్రబాబు పాఠాలుగా మారాయి. ఎవరిని బడితే వారిని సలహాదారులుగా తీసుకోవడం.. ఎవరు చెప్పింది ఏమిటో తెలుసుకోకుండానే.. నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయడం లేదు. ఎవరు ఏం చెప్పినా.. చంద్రబాబు సావధానంగా వింటున్నారు. తర్వాత.. ఏది ప్రజా హితమో అదే నిర్ణయం తీసుకుంటున్నారు.
2) నాయకుల దూకుడు.. నాయకుల దూకుడు విషయంలో చంద్రబాబు పక్కాగా అలెర్ట్ అవుతున్నారు. ఎవరినీ ఆయన వదిలి పెట్టడం లేదు. తేడా వస్తే.. వారిని పిలిచి చర్చిస్తున్నారు. ఎవరూ కట్టుతప్పకుండా.. వ్యవహరిస్తున్నారు. ఎంతటి వారినైనా.. కట్టు తప్పకుండా వ్యవహరిస్తున్నారు. చిన్న తేడా నుంచి పెద్ద తేడా వరకు పరిశీలిస్తున్నారు. క్లాసు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పుల కారణంగా.. నాయకుల దూకుడు కారణంగా పార్టీ నష్టపోయింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
3) ప్రజలకు చేరువగా.. గత వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి ప్రజలకు చేరువ కాలేకపోయారన్న వాదన బలంగా వినిపించింది. అదేవిధంగా ఆఫీసులో ఉన్నతోద్యోగి మాదిరిగా జగన్ వ్యవహరించారని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. తాను ప్రజలకు చేరువగా ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాదు.. రోజు రోజంతా అవసరమైతే.. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ఇది మంచి పరిణామమనిప్రజల నుంచి కూడా కితాబు అందుతోంది.
4) చెట్లు నరికి వేత.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పర్యటనల సమయంలో చెట్లను ఘోరంగా నరికేసేవారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు పర్యటనల సమయంలో చెట్లను నరుకుతున్న ఘటనలు లేవు. ఇటీవల తూర్పుగోదావరి పర్యటనలో చెట్లు నరికిన ఘటన వెలుగు చూడడంతో సదరు టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. పైగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలా.. చంద్రబాబు గత పాఠాల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నారనే చెప్పాలి.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…