Political News

`వెన్నుపోటు`.. వైసీపీ నేత‌ల‌కేనా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తీరు ఏమాత్రం మార‌డం లేద‌న్న వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తోంది. నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు ఆయ‌న పిలుపునిస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా పార్టిసిపేట్ చేయాల‌ని కోరుతున్నారు. ష‌రుతులు పెడుతున్నారు. ఒత్తిడి కూడా తెస్తున్నారు.దీంతో నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ మాత్రం ఎస్కేప్ అవుతున్నారు. ఆయా నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు మాత్రం జ‌గ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనిని పార్టీ నాయ‌కులు త‌ప్పుబ‌ట్టకుండా ఉంటారా? అంటే.. ఖ‌చ్చితంగా త‌ప్పుబ‌డుతున్నారు.

తాజాగా వెన్నుపోటు కార్య‌క్ర‌మంలో త‌మ‌కే త‌మ నాయ‌కుడు వెన్నుపోటు పొడిచాడంటూ.. కొంద‌రు నాయ‌కులు ఆఫ్‌దిరికార్డు గా వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. గ‌త నెల 20నే జ‌గ‌న్‌.. ఈ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న తాను కూడా ఈ కార్య‌క్ర‌మంలో పార్టిసిపేట్ చేస్తాన‌ని.. ఏడాది అయిపోయిన నేప‌థ్యంలో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో తూ.చ‌. త‌ప్ప‌కుండా పాల్గొనాలని కూడా జ‌గ‌న్ సూచించారు. దీంతో ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా.. అనారోగ్యంగా ఉన్నా కూడా.. నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా పాల్గొని అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మ‌రి ఇచ్చిన మాట ప్ర‌కారం.. కార్యక‌ర్త‌ల‌కు చేసిన వాగ్దానం ప్ర‌కార‌మైనా.. జ‌గ‌న్ వెన్నుపోటు కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, అస‌లు ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. క‌నీసం తాడేప‌ల్లిలోని ఇంట్లో కూర్చుని అయినా.. ప‌ర్య‌వేక్షించారా? అంటే అది కూడా లేదు. నేరుగా ఆయ‌న త‌న స‌తీమ‌ణితో క‌లిసి బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. అంతేకాదు.. పార్టీ నాయ‌కుల‌కు కూడా కొద్ది మందికే ఈ స‌మాచారం ఇచ్చారు. దీంతో అంద‌రూ జ‌గ‌న్ తాడేప‌ల్లిలోనే ఉన్నార‌ని అనుకున్నారు.

ఇక‌, మాజీ స‌ల‌హాదారు, ప్ర‌స్తుతం రాష్ట్ర వైసీపీ కోఆర్డినేట‌ర్‌గా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా ఎక్క‌డా బ‌య‌టకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా నివ్వెర పోయారు. ఈ ప‌రిణామంపై పార్టీలోనూ చ‌ర్చ వ‌చ్చింది. వెన్ను పోటు కార్య‌క్ర‌మం వైసీపీ నాయ‌కుల కోస‌మే తీసుకువ‌చ్చారా? అని ప‌లువురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. మ‌రికొంద‌రు.. పార్టీ విధానాన్ని ఎండ‌గ‌ట్టారు. గ‌తంలోనూ విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్ మెంటు విష‌యంపై చేప‌ట్టిన నిర‌సన‌కూడా పెద్ద‌గా ఫ‌లించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంపైనా నాయ‌కులు చ‌ర్చించారు. పార్టీ అధినేత ముందుకు రాకుండా ఇలా త‌ప్పించుకుంటే కార్య‌క్ర‌మాలు ఎలా స‌క్సెస్ అవుతాయ‌న్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి.

This post was last modified on June 6, 2025 6:48 am

Share
Show comments
Published by
Kumar
Tags: YS Jagan

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago