వైసీపీ అధినేత జగన్కు ముందున్నది ముళ్లదారే. ఈ విషయంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. ఆయన అనుకున్నట్టుగానో.. ఆయన ఊహించుకుంటున్నట్టుగానో.. ఏదీ సానుకూలంగా జరుగుతుందని భావించే పరిస్థితి ఇప్పుడు లేదు. తాజాగా చేపట్టిన `వెన్నుపోటు దినం` దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే.. ఆయన అనుకున్న విధంగా అయితే.. ఈ నిరసన సాగలేదు. పైగా గతంలో వైసీపీ పాలనలో పదవులు పొందినవారే.. ఇప్పుడు తీవ్ర విమర్శలతో చెలరేగిపోయారు. జగన్ నేరచరిత్ర ఇదీ అంటూ.. మాటలతో యుద్ధం ప్రకటించారు.
వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే నిరసనలకు.. మంచి ఫలితాలు ఆశించడం పార్టీలకు తప్పుకాదు. అయితే.. ఈ విష యంలో ఆచి తూచి అడుగులు వేయాలి. సమయం, సందర్భం కూడా చూసుకోవాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏమీ అమలు చేయడం లేదనే అనుకున్నా.. ప్రజల్లో ఇంకా అలాంటి ధోరణి కనిపించడం లేదు. “చంద్రబాబు ఉన్నారు.. చేస్తారు.. పవన్ కల్యా ణ్ ఉన్నాడు.. చేయిస్తాడు“ అనే ఆశ సజీవంగా ఉందన్న విషయం తరచుగా వినిపిస్తూనే ఉంది. పైగా.. కళ్ల ముందు కూటమి చేసిన రహదారుల బాగుచేత, పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ పరీక్షలు.. వంటివి కనిపిస్తున్నాయి. సో.. ఈ నేపథ్యాన్ని జగన్ ఎక్కడో మిస్ అయ్యారు.
ప్రజల నాడినిపట్టుకుని వారికి అనుకూలంగా పనిచేసిన పార్టీనే ప్రజల మధ్య ఉంటుంది. ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఈ విషయంలో జగన్ పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న అంశాలను పట్టుకుని.. వాటిపై ఆయన పోరాటాలకు దిగితే..కొంతమేరకైనా సింపతీ దక్కి ఉండేది. కానీ, అలా చేయలేదు. ఏడాది అయింది.. సూపర్ సిక్స్ అమలు చేయలేదన్న ఏకైక వాదనను తెరమీదికి తీసుకువచ్చారు. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. సాధారణ ప్రజలు కూడా పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. ఎవరూ కలిసిరాలేదు. వైసీపీ నాయకులు చేసిన నిరసనలు రికార్డు కూడా చేరలేదు.
మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికల ఫలితం వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాయి. ఇదేసమయంలో వైసీపీని ఏకేశాయి. దీనికి కారణం.. జగన్ ఇచ్చిన పిలుపే. అంతేకాదు.. కూటమి బలంతో పోల్చి నప్పుడు వైసీపీ బలం ఇప్పుడు చాలా వరకు తక్కువగానే ఉంది. అటు మీడియా పరంగా.. ఇటు నాయకుల పరంగా కూడా.. వైసీపీకి ఎదురు దెబ్బలు ఇంకా మానలేదు. ఈ క్రమంలో జగన్ అలివిమీరిన చింతనతో చేపట్టే కార్యక్రమాలకు ఇకనైనా బ్రేకులు వేయాలి. ప్రజల ఆమోదం పొందేలా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే ఆయన చేపట్టే నిరసనలకు, ఆయనకు కూడా విలువ ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…