Political News

జ‌గ‌న్‌కు ముందున్న‌ది ముళ్ల దారే.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ముందున్న‌ది ముళ్ల‌దారే. ఈ విష‌యంలో ఎలాంటి శ‌ష‌భిష‌ల‌కు తావులేదు. ఆయ‌న అనుకున్న‌ట్టుగానో.. ఆయ‌న ఊహించుకుంటున్న‌ట్టుగానో.. ఏదీ సానుకూలంగా జ‌రుగుతుంద‌ని భావించే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. తాజాగా చేపట్టిన `వెన్నుపోటు దినం` దీనికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. ఎందుకంటే.. ఆయ‌న అనుకున్న విధంగా అయితే.. ఈ నిర‌స‌న సాగ‌లేదు. పైగా గ‌తంలో వైసీపీ పాల‌న‌లో ప‌ద‌వులు పొందిన‌వారే.. ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోయారు. జ‌గ‌న్ నేర‌చ‌రిత్ర ఇదీ అంటూ.. మాట‌ల‌తో యుద్ధం ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చేసే నిర‌స‌న‌ల‌కు.. మంచి ఫ‌లితాలు ఆశించ‌డం పార్టీల‌కు త‌ప్పుకాదు. అయితే.. ఈ విష యంలో ఆచి తూచి అడుగులు వేయాలి. స‌మ‌యం, సంద‌ర్భం కూడా చూసుకోవాలి. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఏమీ అమ‌లు చేయ‌డం లేద‌నే అనుకున్నా.. ప్ర‌జ‌ల్లో ఇంకా అలాంటి ధోర‌ణి క‌నిపించ‌డం లేదు. “చంద్ర‌బాబు ఉన్నారు.. చేస్తారు.. ప‌వ‌న్ క‌ల్యా ణ్ ఉన్నాడు.. చేయిస్తాడు“ అనే ఆశ స‌జీవంగా ఉంద‌న్న విష‌యం త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. పైగా.. క‌ళ్ల ముందు కూట‌మి చేసిన ర‌హ‌దారుల బాగుచేత‌, పింఛ‌న్ల పెంపు, మెగా డీఎస్సీ ప‌రీక్ష‌లు.. వంటివి క‌నిపిస్తున్నాయి. సో.. ఈ నేప‌థ్యాన్ని జ‌గ‌న్ ఎక్కడో మిస్ అయ్యారు.

ప్ర‌జ‌ల నాడినిప‌ట్టుకుని వారికి అనుకూలంగా ప‌నిచేసిన పార్టీనే ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటుంది. ప్ర‌జ‌లు కూడా అంగీక‌రిస్తారు. ఈ విషయంలో జ‌గ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌జ‌లు ఇప్పుడు ఇబ్బందులు ప‌డుతున్న అంశాల‌ను ప‌ట్టుకుని.. వాటిపై ఆయ‌న పోరాటాల‌కు దిగితే..కొంత‌మేరకైనా సింప‌తీ ద‌క్కి ఉండేది. కానీ, అలా చేయ‌లేదు. ఏడాది అయింది.. సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయ‌లేద‌న్న ఏకైక వాద‌న‌ను తెర‌మీదికి తీసుకువ‌చ్చారు. ఇది అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ప‌ట్టించుకునే తీరిక లేకుండా పోయింది. ఎవ‌రూ క‌లిసిరాలేదు. వైసీపీ నాయ‌కులు చేసిన నిర‌స‌న‌లు రికార్డు కూడా చేర‌లేదు.

మ‌రోవైపు.. రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో కూట‌మి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకున్నాయి. ఇదేస‌మ‌యంలో వైసీపీని ఏకేశాయి. దీనికి కార‌ణం.. జ‌గ‌న్ ఇచ్చిన పిలుపే. అంతేకాదు.. కూట‌మి బ‌లంతో పోల్చి న‌ప్పుడు వైసీపీ బ‌లం ఇప్పుడు చాలా వ‌ర‌కు త‌క్కువ‌గానే ఉంది. అటు మీడియా ప‌రంగా.. ఇటు నాయ‌కుల ప‌రంగా కూడా.. వైసీపీకి ఎదురు దెబ్బ‌లు ఇంకా మాన‌లేదు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అలివిమీరిన చింత‌న‌తో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు ఇక‌నైనా బ్రేకులు వేయాలి. ప్ర‌జ‌ల ఆమోదం పొందేలా వ్య‌వ‌హ‌రించాలి. అప్పుడు మాత్ర‌మే ఆయ‌న చేప‌ట్టే నిర‌స‌న‌ల‌కు, ఆయ‌న‌కు కూడా విలువ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 5, 2025 2:14 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YCPYS Jagan

Recent Posts

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

2 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

2 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

4 hours ago

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

5 hours ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

5 hours ago

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

6 hours ago