Political News

జ‌గ‌న్‌కు ముందున్న‌ది ముళ్ల దారే.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ముందున్న‌ది ముళ్ల‌దారే. ఈ విష‌యంలో ఎలాంటి శ‌ష‌భిష‌ల‌కు తావులేదు. ఆయ‌న అనుకున్న‌ట్టుగానో.. ఆయ‌న ఊహించుకుంటున్న‌ట్టుగానో.. ఏదీ సానుకూలంగా జ‌రుగుతుంద‌ని భావించే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. తాజాగా చేపట్టిన `వెన్నుపోటు దినం` దీనికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. ఎందుకంటే.. ఆయ‌న అనుకున్న విధంగా అయితే.. ఈ నిర‌స‌న సాగ‌లేదు. పైగా గ‌తంలో వైసీపీ పాల‌న‌లో ప‌ద‌వులు పొందిన‌వారే.. ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోయారు. జ‌గ‌న్ నేర‌చ‌రిత్ర ఇదీ అంటూ.. మాట‌ల‌తో యుద్ధం ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చేసే నిర‌స‌న‌ల‌కు.. మంచి ఫ‌లితాలు ఆశించ‌డం పార్టీల‌కు త‌ప్పుకాదు. అయితే.. ఈ విష యంలో ఆచి తూచి అడుగులు వేయాలి. స‌మ‌యం, సంద‌ర్భం కూడా చూసుకోవాలి. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఏమీ అమ‌లు చేయ‌డం లేద‌నే అనుకున్నా.. ప్ర‌జ‌ల్లో ఇంకా అలాంటి ధోర‌ణి క‌నిపించ‌డం లేదు. “చంద్ర‌బాబు ఉన్నారు.. చేస్తారు.. ప‌వ‌న్ క‌ల్యా ణ్ ఉన్నాడు.. చేయిస్తాడు“ అనే ఆశ స‌జీవంగా ఉంద‌న్న విష‌యం త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. పైగా.. క‌ళ్ల ముందు కూట‌మి చేసిన ర‌హ‌దారుల బాగుచేత‌, పింఛ‌న్ల పెంపు, మెగా డీఎస్సీ ప‌రీక్ష‌లు.. వంటివి క‌నిపిస్తున్నాయి. సో.. ఈ నేప‌థ్యాన్ని జ‌గ‌న్ ఎక్కడో మిస్ అయ్యారు.

ప్ర‌జ‌ల నాడినిప‌ట్టుకుని వారికి అనుకూలంగా ప‌నిచేసిన పార్టీనే ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటుంది. ప్ర‌జ‌లు కూడా అంగీక‌రిస్తారు. ఈ విషయంలో జ‌గ‌న్ పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌జ‌లు ఇప్పుడు ఇబ్బందులు ప‌డుతున్న అంశాల‌ను ప‌ట్టుకుని.. వాటిపై ఆయ‌న పోరాటాల‌కు దిగితే..కొంత‌మేరకైనా సింప‌తీ ద‌క్కి ఉండేది. కానీ, అలా చేయ‌లేదు. ఏడాది అయింది.. సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయ‌లేద‌న్న ఏకైక వాద‌న‌ను తెర‌మీదికి తీసుకువ‌చ్చారు. ఇది అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ప‌ట్టించుకునే తీరిక లేకుండా పోయింది. ఎవ‌రూ క‌లిసిరాలేదు. వైసీపీ నాయ‌కులు చేసిన నిర‌స‌న‌లు రికార్డు కూడా చేర‌లేదు.

మ‌రోవైపు.. రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో కూట‌మి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకున్నాయి. ఇదేస‌మ‌యంలో వైసీపీని ఏకేశాయి. దీనికి కార‌ణం.. జ‌గ‌న్ ఇచ్చిన పిలుపే. అంతేకాదు.. కూట‌మి బ‌లంతో పోల్చి న‌ప్పుడు వైసీపీ బ‌లం ఇప్పుడు చాలా వ‌ర‌కు త‌క్కువ‌గానే ఉంది. అటు మీడియా ప‌రంగా.. ఇటు నాయ‌కుల ప‌రంగా కూడా.. వైసీపీకి ఎదురు దెబ్బ‌లు ఇంకా మాన‌లేదు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అలివిమీరిన చింత‌న‌తో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు ఇక‌నైనా బ్రేకులు వేయాలి. ప్ర‌జ‌ల ఆమోదం పొందేలా వ్య‌వ‌హ‌రించాలి. అప్పుడు మాత్ర‌మే ఆయ‌న చేప‌ట్టే నిర‌స‌న‌ల‌కు, ఆయ‌న‌కు కూడా విలువ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 5, 2025 2:14 pm

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

1 hour ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

2 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

2 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

5 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

6 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

6 hours ago