మరో వారంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. వీటికి సంబంధించి పక్కా ప్రణాళిక కూడా రూపొందించారు. ఈ నెల 12 నాటికి తల్లికి వందనం పేరుతో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా.. కేంద్రం ఈ నెల నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్రం కూడా అదే కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభించనుంది.
ఇక, బడి పిల్లలకు పుస్తకాలను కూడా ఈ నెల 12నాటికి అందించేందుకు సర్కారు సిద్ధమైంది. అంటే మొత్తంగా ప్రభుత్వం మరో వారం రోజుల్లోనే ఆయా పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ నాయకులు.. బుధవారం రోడ్డెక్కడం.. నానా యాగీ చేయడం ఏంటన్నది ప్రశ్న. ఈ విషయాన్ని ప్రభుత్వం తాలూకు పెద్దలు, కూటమి పార్టీల నాయకుల కంటేకూడా.. నెటిజన్లు, సాధారణ ప్రజులు ప్రశ్నిస్తున్నారు.
సహజంగా ఏ ప్రభుత్వానికైనా కీలకమైన పథకాలను అమలు చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఇక, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబుతున్న ఏపీని పైకి తీసుకువచ్చి.. కాయకల్ప చికిత్స చేసి.. లైన్లో పెట్టేందుకు సమయం సరిపోయిందని సర్కారు పెద్దలే చెబుతున్నారు. దీంతో కొన్ని కీలక పథకాలను ఆర్థిక భారం అనుకున్న పథకాలను వాయిదా వేసిన మాట నిజమేనని సీఎం చంద్రబాబు ఇటీవల మహానాడు వేదికగానే ప్రకటించారు.
ఈ క్రమంలో వైసీపీ కొంత ఆలోచనాత్మక విధానంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా కాకుండా.. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా వ్యవహరిస్తే.. ప్రయోజనం ఏంటన్నది సాధారణ ప్రజల ప్రశ్న. సమయం ఇవ్వకుండానే.. ప్రశ్నించడం సరికాదని, అయినా.. ఇప్పటికే పింఛన్లు పెంచారు, సిలిండర్లు ఇస్తున్నారు.. పెట్టుబడులు తెస్తున్నారని వారు అంటున్నారు. కాబట్టి.. వైసీపీ యాగీ చేయడం సరికాదన్న టాక్ సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 4, 2025 4:59 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…