మాజీ సీఎం కేసీఆర్ ది గట్టి గుండె అని.. అందుకే అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బీఆర్ ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై రాజకీయాలు చేయడం తగదని ఆమె సూచించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం వెనుక.. ఆయనను రాజకీయంగా బద్నాం చేయాలన్న ఉద్దేశం ఉందని ఆరోపించారు. “సింహాన్ని చర్చకు పిలుస్తారా?“ అని ఆమె సటైర్లు వేశారు. ఏం తప్పు చేశారని కేసీఆర్ను విచారణకు పిలుస్తారని ప్రశ్నించారు.
అన్ని తప్పులు చేసిన వారు.. మౌనంగా ఉన్నారని.. కానీ, ఏ తప్పూ చేయని వారిని మాత్రం విచారణల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. “తెలంగాణను తీసుకురావడం వల్లే.. కొందరు పదవులు దక్కించుకున్నారు. ఒకాయన సీఎం అయ్యాడు. ఇది పైకి కనిపిస్తున్న వాస్తవం. ఇది తెచ్చింది కేసీఆర్ కాదా! అదేవిధంగా కాళేశ్వరం కట్టడం వల్లే.. రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ఇది కూడా కనిపిస్తున్న వాస్తవం. కానీ, కొందరు ఒప్పుకోవడం లేదు. పైగా మేలు చేసిన నాయకుడికి కీడు తలపెడుతున్నారు. కేసీ ఆర్ది పెద్ద గుండె కాబట్టే.. ఆయన ఇంత ప్రాజెక్టును భుజాన వేసుకున్నారు“ అని కవిత వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు. ఆయనకు నోటీసులు ఇచ్చారంటే అవి.. మొత్తం తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టు కాదా? తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం, రైతులకు మేలు చేయాలని కోరుకోవడం.. కేసీఆర్ చేసిన తప్పా?“ అని కవిత ప్రశ్నించారు. ‘‘అది కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్. ప్రాజెక్టు పూర్తి చేస్తే.. తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది.“ అని కవిత వ్యాఖ్యానించారు.
కవిత జెండా-అజెండా!
తాజాగా బుధవారం హైదరాబాద్లోని ఇందిరా పార్కులో కవిత నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ.. చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎక్కడా బీఆర్ ఎస్ జెండా కనిపించలేదు. అంతేకాదు.. బలమైన నాయకులు కూడా తారసపడలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది కవిత జెండా.. అజెండా ప్రకారమే జరిగిందనే వాదన వినిపిస్తోంది. పైగా.. కేసీఆర్ కూడా ఈ నిరసనపై ఎక్కడా పెదవి విప్పలేదు. తనకు నోటీసులు ఇచ్చారు కాబట్టి.. నిరసన తెలపండి! అని ఎక్కడా చెప్పలేదు. దీంతో సీనియర్లు ఎవరూ ఈ ధర్నాకు రాకపోవడం గమనార్హం.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…