Political News

`యువ‌గ‌ళం` భేష్‌.. లోకేష్‌కు ప‌వ‌న్ అభినంద‌న‌!

“యువ‌గ‌ళం పాద‌యాత్ర భేష్‌. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌ను అంత‌మొందించేందుకు చేప‌ట్టిన ఈ పాద యాత్ర స‌ఫ‌లీకృత‌మైంది.“ అని డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. నాడు 2023-24 మ‌ధ్య టీడీపీ నేత‌, ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను ఆయ‌న అభినందించారు. తాజాగా నారా లోకేష్ త‌న పాద‌యాత్ర‌పై పుస్త‌కం రూపొందించిన విష‌యం తెలిసిందే. అనేక విష‌యాలు.. ఫొటోల‌తో రూపొందించిన ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర పుస్త‌కాన్ని తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అందించా రు.

బుధ‌వారం ఉద‌యం 12 గంట‌ల‌కు స‌చివాలయంలో ఏపీ మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌ను క‌లుసుకున్న మంత్రి నారా లోకేష్ .. ఇత‌ర మంత్రుల స‌మ‌క్షంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు యువ‌గ‌ళం పాద‌యాత్ర పుస్త‌కాన్ని అందించారు. దీనిని ఆసాంతం ప‌రిశీలించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. నాటి పాద‌యాత్ర విశేషాల‌ను స‌మ‌గ్రంగా వివ‌రించారంటూ.. లోకేష్‌ను అభినందించారు.

అంతేకాదు.. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న పోయి.. ఏడాది అయింద‌ని.. దీనికి యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా.. చాలా క‌లిసి వ‌చ్చిందని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రినీ పాద‌యాత్ర క‌దిలించింద‌ని.. సుదీర్ఘ ప్ర‌స్థానం పాద‌యాత్ర సాగడం విశేష‌మేన‌ని చెప్పారు. మ‌న‌స్పూర్తిగా నారా లోకేష్‌ను అభినందిస్తున్నాన‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా పాద‌యాత్ర ప్ర‌స్తావించింద‌ని తెలిపారు. త‌ద్వారా రాష్ట్రంలో మార్పున‌కు యువ‌గ‌ళం నాంది ప‌లికింద‌న్నారు.

This post was last modified on June 4, 2025 3:04 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

1 hour ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago