“యువగళం పాదయాత్ర భేష్. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు చేపట్టిన ఈ పాద యాత్ర సఫలీకృతమైంది.“ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నాడు 2023-24 మధ్య టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రను ఆయన అభినందించారు. తాజాగా నారా లోకేష్ తన పాదయాత్రపై పుస్తకం రూపొందించిన విషయం తెలిసిందే. అనేక విషయాలు.. ఫొటోలతో రూపొందించిన ఈ యువగళం పాదయాత్ర పుస్తకాన్ని తాజాగా పవన్ కల్యాణ్కు అందించా రు.
బుధవారం ఉదయం 12 గంటలకు సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఈ సమయంలో ఆయనను కలుసుకున్న మంత్రి నారా లోకేష్ .. ఇతర మంత్రుల సమక్షంలో పవన్ కల్యాణ్కు యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందించారు. దీనిని ఆసాంతం పరిశీలించిన పవన్ కల్యాణ్.. నాటి పాదయాత్ర విశేషాలను సమగ్రంగా వివరించారంటూ.. లోకేష్ను అభినందించారు.
అంతేకాదు.. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి.. ఏడాది అయిందని.. దీనికి యువగళం పాదయాత్ర కూడా.. చాలా కలిసి వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరినీ పాదయాత్ర కదిలించిందని.. సుదీర్ఘ ప్రస్థానం పాదయాత్ర సాగడం విశేషమేనని చెప్పారు. మనస్పూర్తిగా నారా లోకేష్ను అభినందిస్తున్నానని.. పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కూడా పాదయాత్ర ప్రస్తావించిందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో మార్పునకు యువగళం నాంది పలికిందన్నారు.
This post was last modified on June 4, 2025 3:04 pm
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి.…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…
వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…
తెలుగు టీవీ చరిత్రలోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒకటి. అప్పటికే వేరే ఛానెళ్లలో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నప్పటికీ.…
తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారి స్తున్న విషయం…
బాలీవుడ్ హీరోయిన్లలో ప్రేమకథలు, బ్రేకప్లు లేని వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అక్కడ పెద్దగా దాపరికాలు కూడా ఏమీ ఉండవు. ఎక్కువగా…