Political News

విడదల రజినీని జగన్ పక్కన పెట్టేశారా?

విడదల రజినీ.. పూర్వాశ్రమంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్ట్రాంగ్ లేడీ. అంతేనా మస్తు మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతగానూ ఆమె గుర్తింపు పొందారు. తొలుత టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజినీ…2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలోకి చేరి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… రెండున్నరేళ్లకే మంత్రి కూడా అయ్యారు. వైసీపీ మంచి ప్రాధాన్యత దక్కిన నేతగానూ రజినీకి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు జగన్ ఆమెను పూర్తిగా పక్కనపెట్టేశారు. జగన్ తెనాలి పర్యటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది.

పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారన్న ఆరోపణలతో ముగ్గురు యువకులపై పోలీసులు నడిరోడ్డుపై లాఠీలు ఝుళిపించారు. ఈ వీడియో బయటకు రావడంతో వారిని పరామర్శించేందుకు జగన్ మంగళవారం తెనాలి వెళ్లారు. ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విడదల రజినీ, స్థానిక నేత అన్నాబత్తుని శివకుమార్ తదిరులు ఉన్నారు. అయితే వీరిలో మిగిలిన వారంతా జగన్ వెంటే కనిపించారు గానీ… ఏ ఒక్క చోట కూడా జగన్ కు దగ్గరగా రజినీ కనిపించిన దాఖలానే లేదు. ఏదో అలా ఓ సామాన్య కార్యకర్త మాదిరిగా ఆమె వ్యవహరించక తప్పలేదు.

వాస్తవానికి గతంలో జగన్ పర్యటనల్లో రజినీ పాలుపంచుకుంటే… జగన్ ను అనుసరిస్తూ కనిపించేవారు. మీడియాతో మాట్లాడే సందర్భంగానూ జగన్ పక్కన్నే నిలబడేవారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో జగన్ పర్యటనల్లో రజినీ పాలుపంచుకున్నా ఇదే తరహా ప్రాదాన్యం ఆమెకు దక్కింది. అయితే ఈ దఫా తెనాలి బాధితుడు జాన్ విక్టర్ ఇంటిలో గానీ, జగన్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా గానీ… రజినీ జాడే కనిపించలేదు. కార్యక్రమం ముగిసిన తర్వాత జగన్ వెళ్లిపోతుంటే… ఆయన వెంట కార్యకర్తలు కదలగా… జగన్ కు అల్లంత దూరాన ఓ సామాన్య కార్యకర్త మాదిరిగా రజినీ కదిలిపోయారు.

అయినా రజినీని జగన్ అంతగా దూరంగా పెట్టడానికి కారణాలేమిటన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని రజినీ అండ్ కో బెదిరించి రూ.2.2 కోట్ల మేర వసూళ్లు చేసిన వైనంపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో రజినీ మరిది గోపి అరెస్టై ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఓ కార్యకర్తను తన కారులో కూర్చోబెట్టుకుని పోలీసుతో రజినీ వాగ్వాదానికి దిగిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో రజినీ అంత సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఏముందన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే రజినీని జగన్ దూరం పెట్టినట్టు సమాచారం.

This post was last modified on June 3, 2025 11:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago