తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రెండు రోజుల కిందట వరకు.. మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయి. మొత్తంగా 108 దేశాలకు చెందిన సుందరీమణులు.. ఈ పోటీలో పాల్గొన్నారు. దాదాపు 20 రోజుల పాటు వారు ఇక్కడే ఉన్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను.. రాష్ట్ర ఉన్నతిని ప్రపంచానికి చాటుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మొత్తంగా ఈ అందాల సుందరుల పోటీలు ముగిశాయి. అయితే.. ఇప్పుడు అసలు పొలిటికల్ కంటెస్ట్ ప్రారంభమైంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి.. కీలకమైన 2 ప్రశ్నలు సంధిస్తూ.. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఈ పోటీలకు.. రాష్ట్ర సర్కారు 200 కోట్లను ఖర్చు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒక్కొక్క కంటెస్టెంటుకు కూడా.. 30 తులాల బంగారు ఆభరణాలను రాష్ట్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చిందని ఆరోపించారు.
ఈ వ్యవహారం.. రాజకీయ రంగు పులుముకుంటోందన్న వాదన తెరమీదికి రావడంతోనే ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని హరీష్రావును నిలదీశారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని పద్దులను వివరించారు. మిస్ వరల్డ్ కంటెస్టు కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. మొత్తం ఖర్చును 31 కోట్లుగా పేర్కొన్న జూపల్లి.. దీనిలో 21 కోట్ల రూపాయలు స్పాన్సర్ల నుంచే వచ్చాయని తెలిపారు.
మిగిలిన మొత్తానికి కూడా ఒప్పందాలు ఉన్నాయని.. ఆ సొమ్ములు కూడా వస్తాయని చెప్పారు. అదేవిధం గా పోటీలో పాల్గొన్న అందగత్తెలకు.. ఎలాంటి కానుకలు ఇవ్వలేదని తెలిపారు. 30 తులాల బంగారాన్ని కానుకగా ఇచ్చారన్న హరీష్ రావు వ్యాఖ్యలను కొట్టి పారేశారు. వారికి 3 తులాలు కాదుకదా.. 3 గ్రాముల బంగారాన్ని కూడా కానుకలుగా ఇవ్వలేదని.. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ రువ్వారు. మరి దీనిపై బీఆర్ ఎస్ ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2025 5:58 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…