Political News

జ‌గ‌న్‌ ఉగ్ర‌వాదుల‌ను కూడా ప‌రామ‌ర్శిస్తాడా?: జ‌న‌సేన‌ కిరణ్ రాయల్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై జ‌న‌సేన నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా మంగ‌ళ‌వారం జ‌గ‌న్‌.. తెనాలిలో పోలీసులతో లాఠీ దెబ్బ‌లు తిన్న యువ‌కుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌ర్కారు, పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఘ‌ట‌న‌ను ఉద్దేశించి.. జ‌న‌సేన నాయ‌కుడు, తిరుప‌తి జిల్లా పార్టీ ఇన్ చార్జి కిర‌ణ్ రాయ‌ల్ స్పందించారు. జ‌గ‌న్‌పైనా, ఆయ‌న వ్య‌వ‌హార శైలి పైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

గ‌త ఏప్రిల్ 22న ప‌హ‌ల్గాం ఉగ్ర‌వాద దాడి ఘ‌ట‌న త‌ర్వాత‌.. భార‌త ప్ర‌భుత్వం చేసిన ఆప‌రేష‌న్ సిందూర్ లో  ఉగ్ర‌వాదులు చ‌నిపోయార‌ని కిర‌ణ్ రాయ‌ల్ అన్నారు. జ‌గ‌న్‌ను వ‌దిలేస్తే.. ఆ ఉగ్ర‌వాదుల కుటుంబాల ను కూడా ప‌రామ‌ర్శిస్తార‌నే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంద‌న్నారు. సంఘ విద్రోహ శ‌క్తుల‌ను శిక్షించేందుకే పోలీసులు ఉన్నార‌ని తెలిపారు. గొడ్డలిని ఒక చేత్తో, వైసిపి జెండాను మరో చేత్తో పట్టుకుని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు..? అని ప్ర‌శ్నించారు.

“జగన్ తెనాలికి వెళ్ళడం హాస్యాస్పదం. గంజాయి బ్యాచ్ ను జగన్ పరామర్సించడమేంటి..? పహల్గాంలో ఉగ్ర దాడి చేసిన ఉగ్రవాదులను కూడా ఆయ‌న పరామర్శిస్తాడేమో? అధికారం కోల్పోయిన తరువాత జగన్ కు మతిభ్రమించింది.“ అని కిర‌ణ్ రాయ‌ల్ ఎద్దేవా చేశారు. ఇక‌, ఈ నెల 4న జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న వెన్నుపోటు దినం పైనా రాయ‌ల్ స్పందించారు. త‌న స‌మ‌స్య‌ను.. త‌న రాజ‌కీయ నిరుద్యోగాన్ని ప్ర‌జ‌ల‌పై రుద్ద‌తున్నార‌ని వ్యాఖ్యానించారు.

“జగనే పెద్ద వెన్నుపోటుదారుడు. వైసిపి నేతలకు వెన్నుపోటు రాజకీయాన్ని నేర్పించింది జగనే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు లేఖ రాస్తున్నా. `గుండెపోటు` దినం పెట్టమని డబ్ల్యుహెచ్ఓను కోరుతున్నాం. జగన్ సైతాన్ ను మించిపోతున్నాడు.“ అని కిర‌ణ్ రాయ‌ల్ విమ‌ర్శ‌ల‌కు దిగారు. 

Kumar

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

10 minutes ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

2 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

2 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

2 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

3 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

4 hours ago