Political News

పాత కేసులు ఉంటే కొట్టేస్తారా : జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాటి తెనాలి పర్యటన నిరసనలతో మొదలు కాగా… ఏ బాధితులను అయితే పరామర్శించడానికి వెళ్లారో…వారికే షాకిచ్చేలా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పిల్లలను తాను వెనకేసుకుని రావడం లేదని ఆయన బహిరంగంగా ప్రకటించి… బాదితుల కుటుంబాలను ఆయన షాక్ కు గురి చేశారు. ఈ పిల్లలు గతంలో తప్పులు చేసి ఉండవచ్చు కూడా అని జగన్ వ్యాఖ్యానించారు. యుక్త వయసులో వారు చేసిన తప్పులపై కేసులు నమోదు అయితే వాటిలో దోషత్వాన్ని తేల్చాల్సింది కోర్టులే గానీ పోలీసులు కాదని ఆయన అన్నారు. 

తెనాలిలో ఐతా నగర్ కు చెందిన ముగ్గురు యువకులు ఓ కానిస్టేబుల్ పై దాడి చేశారన్న ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నడిరోడ్డుపై బహిరంగంగా వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎప్పుడో నెల క్రితం జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా వెలుగులోకి రాగా… వైసీపీ భగ్గుమంది. ఇదేక్కడి లా అండ్ ఆర్డర్ అని జగన్ సహా వైసీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసుల దాడిలో గాయపడ్డ యువకులను పరామర్శించేందుకు తానే స్వయంగా తెనాలి వెళ్లాలని జగన్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రకటనపై టీడీపీ ఘాటు విమర్శలు చేసింది. గంజాయి బ్యాచ్ ను పరామర్శించేందుకు జగన్ వెళుతున్నారంటూ ఆరోపించింది.

ఈ ఆరోపణలను లెక్కచేయని జగన్ తాను అనుకున్నట్లుగానే మంగళవారం తెనాలి వెళ్లారు. అయితే తెనాలిలో అడుగుపెట్టగానే జగన్ కు నిరసన సెగ తగిలింది. గతంలో చనిపోయిన కిరణ్ డెడ్ బాడీ ఎక్కడ? అంటూ టీడీపీ కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని జగన్ కు నిరసన తెలిపారు. జగన్ గో బ్యాక్ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్యే ఐతా నగర్ చేరుకున్న జగన్ నేరుగా బాధితుడు జాన్ విక్టర్ ఇంటికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరు బాదితుల కుటుంబాలను కూడా అక్కడికే పిలిపించుకుని పరామర్శించారు. అనంతరం ఆయన జాన్ విక్టర్ ఇంటి ముందటే మీడియాతో మాట్లాడారు.

దాదాపుగా అరగంటకు పైగానే ప్రసంగించిన జగన్.. బాధితులపై పోలీసులు కాఠిన్యం ప్రదర్శించారని, రాష్ట్రంలో అమలు అవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది ప్రబల నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని విపులంగా వివరించిన జగన్… తన ప్రసంగం ముగిసే సమయానికి కాస్తంత ముందుగా… బాదితులపై గతంలో ఏ కేసులు ఉన్నాయో కూడా తనకు తెలియదని తెలిపారు. అంతటితో ఆగని ఆయన ఈ పిల్లలను తాను వెనకేసుకుని రావడం లేదని కూడా సంచలన ప్రకటన చేశారు. ఈ మాట విన్నంతనే బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు షాక్ కు గురయ్యారు. కేసులుంటే… వారు దోషులో, కాదో తేల్చాల్సింది కోర్టులు గానీ, పోలీసులు కాదని జగన్ అన్నారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు.

This post was last modified on June 3, 2025 3:25 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YS Jagan

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago