Political News

నందిగంతో సజ్జల ములాఖత్… ఇప్పుడే ఎందుకంటే..?

వైసీపీ అదికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఓ రేంజిలో తనదైన హవా సాగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో పాలుపంచుకున్నవారంతా దాదాపుగా నందిగం అనుచరవర్గమేనని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయనపై ఇతరత్రా పలు కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి సర్కారు అదికారంలోకి రాగానే… పాత కేసుల బూజు దులపగా… నందిగం అరెస్టయ్యారు. ఏకంగా 3 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఆ సందర్భంగా సురేశ్ ను జగన్ జైల్లో కలిసి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత సురేశ్ ను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.

కొన్నాళ్లకు ఎలాగోలా బెయిల్ తీసుకుని వచ్చిన నందిగంను ఇటీవలే మరో కొత్త కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నందిగం గుంటూరు జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా నందిగం బాగోగులు, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన సజ్జల.. ఆ తర్వాత బయటకు వచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఓ కేసులో బెయిల్ తెచ్చుకుంటే మరో కేసులో అరెస్టు చేస్తున్నారంటూ కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. కల్పిత కేసులతో వైసీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

ఇదంతా బాగానే ఉంది గానీ… ఇప్పుడే సజ్జల ఈ ములాఖత్ ల బాట పట్టడానికి కారణమేమిటన్న దానిపై వైసీపీలోనే జోరుగా చర్చ జరుగుతోంది. ఎప్పుడు కార్యాలయం దాటి బయటకు రాని సజ్జల…నందిగం సురేశ్ ను కలిసేందుకు ఏకంగా జైలుకు ములాఖత్ దరఖాస్తు చేసుకోవడం, అనుమతి రాగానే జైలుకు వెళ్లి మరీ ఆయనను కలవడం చూస్తుంటే ఇదేదో పెద్ద వ్యూహం మాదిరే కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా మంది నేతలు అరెస్టు అయినా జైళ్ల ముఖం కూడా చూడని సజ్జల ఇప్పుడు తరచూ జైళ్లలోని తమ పార్టీ నేతలను కలవడానికి ఆసక్తి చూపిస్తుండటం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ తరహా సజ్జల వైఖరికి కారణమిదేనంటూ వైసీపీ వర్గాలు ఓ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉండగా… ఆయన వద్ద సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిలను సజ్జల నేరుగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ కలిశారు. ఆ తర్వాత నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని కూడా సజ్జల కలిశారు. ఈ ముగ్గురు నేతలూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. వైసీపీకి చెందిన చాలా మంది నేతలు జైళ్లలో ఉంటే… సజ్జల మాత్రం కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే కలుస్తున్నారు అంటూ ప్రచారం మొదలైందట. ఈ ప్రచారం నిజం కాదని చెప్పేందుకే సజ్జల గుంటూరు జైలుకు వెళ్లి నందిగం సురేశ్ ను కలిశారట.

This post was last modified on June 2, 2025 10:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

50 seconds ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago