ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమానిటైజేషన్ కూడా ఒకటి. అన్నింటికంటే కూడా ఈ నిర్ణయమే అతి పెద్దదని కూడా చెప్పాలి. ఈ నిర్ణయంతో అప్పటిదాకా ఉన్న రూ.100, రూ.500 నోట్లు రద్దు కాగా…కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే రూ.100, రూ.500 నోట్లను మార్చిన తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. జనం వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను తిరిగి స్వీకరించేందుకు కొంత సమయం పెట్టుకుంది. ఆ సమయం 2023తోనే ముగిసింది. అయితే ఇప్పటికీ జనం వద్ద పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లు ఉండిపోయాయట. ఈ మేరకు సోమవారం ఆర్బీఐ ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది.
ఆర్బీఐ ప్రకటన మేరకు ఇప్పటిదాకా రద్దు అయిన రూ.2 వేల నోట్లలో 98.26 శాతం నోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుకు చేరాయట. అంటే… ఇంకా 1.74 శాతం నోట్లు జనం వద్ద ఉన్నట్టు. ఈ 1.74 శాతం రూ.2 వేల నోట్ల విలువ ఎంతో తెలుసా?.. ఏకంగా రూ.6,181 కోట్టు. నిజమా?… ఇన్నేసి కోట్ల విలువ చేసే రూ.2 వేల నోట్లు ఇంకా జనం వద్దే ఉన్నాయా? అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే… కొంతమందికి రూ.2 వేల నోట్లను మార్చుకునే మార్గాలు తెలియకపోవచ్చు. లేదంటే… బడా బాబులు వాటిని తమ రహస్య నేల మాళిగల్లో దాచుకుని ఉండవచ్చు.
ఏది ఏమైనా రద్దు అయిన ఈ రూ.2 వేల నోట్లు సామాన్యం జనం వద్ద ఉన్నా, బడా బాబుల వద్ద ఉన్నా… అవి చెల్లుబాటు కావు కదా. అవును చెల్లుబాటు కావు. అంటే ప్రభుత్వానికేమీ నష్టం లేదు గానీ.. వాటిని భద్రంగా దాచుకున్న వారికే నష్టం. అయితే ఈ తరహా నష్టాలను కూడా నివారించేందుకు మరోమారు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు… మీ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఎంపిక చేసిన పోస్టాఫీసులకు వెళ్లి… మన వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. గతంలో ఇచ్చిన భారీ సమయానికే స్పందించని జనం ఇప్పుడు మాత్రం ఏం స్పందిస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
This post was last modified on June 2, 2025 9:46 pm
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…