ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమానిటైజేషన్ కూడా ఒకటి. అన్నింటికంటే కూడా ఈ నిర్ణయమే అతి పెద్దదని కూడా చెప్పాలి. ఈ నిర్ణయంతో అప్పటిదాకా ఉన్న రూ.100, రూ.500 నోట్లు రద్దు కాగా…కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే రూ.100, రూ.500 నోట్లను మార్చిన తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. జనం వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను తిరిగి స్వీకరించేందుకు కొంత సమయం పెట్టుకుంది. ఆ సమయం 2023తోనే ముగిసింది. అయితే ఇప్పటికీ జనం వద్ద పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లు ఉండిపోయాయట. ఈ మేరకు సోమవారం ఆర్బీఐ ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది.
ఆర్బీఐ ప్రకటన మేరకు ఇప్పటిదాకా రద్దు అయిన రూ.2 వేల నోట్లలో 98.26 శాతం నోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుకు చేరాయట. అంటే… ఇంకా 1.74 శాతం నోట్లు జనం వద్ద ఉన్నట్టు. ఈ 1.74 శాతం రూ.2 వేల నోట్ల విలువ ఎంతో తెలుసా?.. ఏకంగా రూ.6,181 కోట్టు. నిజమా?… ఇన్నేసి కోట్ల విలువ చేసే రూ.2 వేల నోట్లు ఇంకా జనం వద్దే ఉన్నాయా? అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే… కొంతమందికి రూ.2 వేల నోట్లను మార్చుకునే మార్గాలు తెలియకపోవచ్చు. లేదంటే… బడా బాబులు వాటిని తమ రహస్య నేల మాళిగల్లో దాచుకుని ఉండవచ్చు.
ఏది ఏమైనా రద్దు అయిన ఈ రూ.2 వేల నోట్లు సామాన్యం జనం వద్ద ఉన్నా, బడా బాబుల వద్ద ఉన్నా… అవి చెల్లుబాటు కావు కదా. అవును చెల్లుబాటు కావు. అంటే ప్రభుత్వానికేమీ నష్టం లేదు గానీ.. వాటిని భద్రంగా దాచుకున్న వారికే నష్టం. అయితే ఈ తరహా నష్టాలను కూడా నివారించేందుకు మరోమారు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు… మీ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఎంపిక చేసిన పోస్టాఫీసులకు వెళ్లి… మన వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. గతంలో ఇచ్చిన భారీ సమయానికే స్పందించని జనం ఇప్పుడు మాత్రం ఏం స్పందిస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం…
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య…