ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమానిటైజేషన్ కూడా ఒకటి. అన్నింటికంటే కూడా ఈ నిర్ణయమే అతి పెద్దదని కూడా చెప్పాలి. ఈ నిర్ణయంతో అప్పటిదాకా ఉన్న రూ.100, రూ.500 నోట్లు రద్దు కాగా…కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే రూ.100, రూ.500 నోట్లను మార్చిన తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. జనం వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను తిరిగి స్వీకరించేందుకు కొంత సమయం పెట్టుకుంది. ఆ సమయం 2023తోనే ముగిసింది. అయితే ఇప్పటికీ జనం వద్ద పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లు ఉండిపోయాయట. ఈ మేరకు సోమవారం ఆర్బీఐ ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది.
ఆర్బీఐ ప్రకటన మేరకు ఇప్పటిదాకా రద్దు అయిన రూ.2 వేల నోట్లలో 98.26 శాతం నోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుకు చేరాయట. అంటే… ఇంకా 1.74 శాతం నోట్లు జనం వద్ద ఉన్నట్టు. ఈ 1.74 శాతం రూ.2 వేల నోట్ల విలువ ఎంతో తెలుసా?.. ఏకంగా రూ.6,181 కోట్టు. నిజమా?… ఇన్నేసి కోట్ల విలువ చేసే రూ.2 వేల నోట్లు ఇంకా జనం వద్దే ఉన్నాయా? అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే… కొంతమందికి రూ.2 వేల నోట్లను మార్చుకునే మార్గాలు తెలియకపోవచ్చు. లేదంటే… బడా బాబులు వాటిని తమ రహస్య నేల మాళిగల్లో దాచుకుని ఉండవచ్చు.
ఏది ఏమైనా రద్దు అయిన ఈ రూ.2 వేల నోట్లు సామాన్యం జనం వద్ద ఉన్నా, బడా బాబుల వద్ద ఉన్నా… అవి చెల్లుబాటు కావు కదా. అవును చెల్లుబాటు కావు. అంటే ప్రభుత్వానికేమీ నష్టం లేదు గానీ.. వాటిని భద్రంగా దాచుకున్న వారికే నష్టం. అయితే ఈ తరహా నష్టాలను కూడా నివారించేందుకు మరోమారు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు… మీ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఎంపిక చేసిన పోస్టాఫీసులకు వెళ్లి… మన వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. గతంలో ఇచ్చిన భారీ సమయానికే స్పందించని జనం ఇప్పుడు మాత్రం ఏం స్పందిస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
This post was last modified on June 2, 2025 9:46 pm
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…