Political News

అభివృద్ధిలో తెలంగాణ కంటే ఏపీ అద్భుతం: తెలంగాణ ఎంపీ

తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతూ ఉంటే తెలంగాణ మాత్రం అన్ని వనరులున్నప్పటికీ వెలవెలబోతోందని ఆయన అన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం కంటే కూడా తక్కువ తలసరి ఆదాయం ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఏపీ అద్భుతంగా రాణిస్తోందని ఆయన పేర్కొన్నారు.

వాస్తవంగా 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు హయాంలో ఏపీ కష్టాల ఊబిలో నుంచి త్వరితగతిననే బయటపడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ దుందుడుకు వైఖరి కారణంగా ఏపీ అభివృద్ధి కుంటు పడిందని చెప్పక తప్పదు. అయితే తిరిగి ఐధేళ్లకే చంద్రబాబు మరోమారు సీఎం కావడంతో ఏపీ దశ మారిపోయిందని చెప్పక తప్పదు. చంద్రబాబు రెండో సారి సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఈ 11 నెలల్లోనే ఏపీకి ఏకంగా రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే ఏకంగా 7 లక్షల మేర ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అలా ఎక్కడి పనులు అక్కడే నిలిచిన అమరావతి నిర్మాణ పనులను చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీంతో ఏపీ ముఖచిత్రం వేగంగా మారిపోయిందని చెప్పక తప్పదు.

అటు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన అయినా…ఇటు కాంగ్రెస్ 16 నెలల పాలన అయినా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఈటెల ఆరోపించారు. తెలంగాణ కుంగుబాటుకు ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడమే వారికి సరిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పరస్పర నిందారోపణలు ఇప్పటికైనా ఆపి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే… రాజకీయ కక్షలను పక్కనపెడితే తెలంగాణ అభివృద్ధి రాకెట్ లా దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

This post was last modified on June 2, 2025 3:37 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

40 minutes ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

60 minutes ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

2 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

3 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

3 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

4 hours ago