Political News

అభివృద్ధిలో తెలంగాణ కంటే ఏపీ అద్భుతం: తెలంగాణ ఎంపీ

తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతూ ఉంటే తెలంగాణ మాత్రం అన్ని వనరులున్నప్పటికీ వెలవెలబోతోందని ఆయన అన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం కంటే కూడా తక్కువ తలసరి ఆదాయం ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఏపీ అద్భుతంగా రాణిస్తోందని ఆయన పేర్కొన్నారు.

వాస్తవంగా 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు హయాంలో ఏపీ కష్టాల ఊబిలో నుంచి త్వరితగతిననే బయటపడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ దుందుడుకు వైఖరి కారణంగా ఏపీ అభివృద్ధి కుంటు పడిందని చెప్పక తప్పదు. అయితే తిరిగి ఐధేళ్లకే చంద్రబాబు మరోమారు సీఎం కావడంతో ఏపీ దశ మారిపోయిందని చెప్పక తప్పదు. చంద్రబాబు రెండో సారి సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఈ 11 నెలల్లోనే ఏపీకి ఏకంగా రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే ఏకంగా 7 లక్షల మేర ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అలా ఎక్కడి పనులు అక్కడే నిలిచిన అమరావతి నిర్మాణ పనులను చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీంతో ఏపీ ముఖచిత్రం వేగంగా మారిపోయిందని చెప్పక తప్పదు.

అటు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన అయినా…ఇటు కాంగ్రెస్ 16 నెలల పాలన అయినా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఈటెల ఆరోపించారు. తెలంగాణ కుంగుబాటుకు ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడమే వారికి సరిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పరస్పర నిందారోపణలు ఇప్పటికైనా ఆపి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే… రాజకీయ కక్షలను పక్కనపెడితే తెలంగాణ అభివృద్ధి రాకెట్ లా దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

33 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago