తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతూ ఉంటే తెలంగాణ మాత్రం అన్ని వనరులున్నప్పటికీ వెలవెలబోతోందని ఆయన అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం కంటే కూడా తక్కువ తలసరి ఆదాయం ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఏపీ అద్భుతంగా రాణిస్తోందని ఆయన పేర్కొన్నారు.
వాస్తవంగా 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు హయాంలో ఏపీ కష్టాల ఊబిలో నుంచి త్వరితగతిననే బయటపడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ దుందుడుకు వైఖరి కారణంగా ఏపీ అభివృద్ధి కుంటు పడిందని చెప్పక తప్పదు. అయితే తిరిగి ఐధేళ్లకే చంద్రబాబు మరోమారు సీఎం కావడంతో ఏపీ దశ మారిపోయిందని చెప్పక తప్పదు. చంద్రబాబు రెండో సారి సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఈ 11 నెలల్లోనే ఏపీకి ఏకంగా రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే ఏకంగా 7 లక్షల మేర ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అలా ఎక్కడి పనులు అక్కడే నిలిచిన అమరావతి నిర్మాణ పనులను చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీంతో ఏపీ ముఖచిత్రం వేగంగా మారిపోయిందని చెప్పక తప్పదు.
అటు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన అయినా…ఇటు కాంగ్రెస్ 16 నెలల పాలన అయినా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఈటెల ఆరోపించారు. తెలంగాణ కుంగుబాటుకు ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడమే వారికి సరిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పరస్పర నిందారోపణలు ఇప్పటికైనా ఆపి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే… రాజకీయ కక్షలను పక్కనపెడితే తెలంగాణ అభివృద్ధి రాకెట్ లా దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on June 2, 2025 3:37 pm
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…