తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతూ ఉంటే తెలంగాణ మాత్రం అన్ని వనరులున్నప్పటికీ వెలవెలబోతోందని ఆయన అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం కంటే కూడా తక్కువ తలసరి ఆదాయం ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఏపీ అద్భుతంగా రాణిస్తోందని ఆయన పేర్కొన్నారు.
వాస్తవంగా 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు హయాంలో ఏపీ కష్టాల ఊబిలో నుంచి త్వరితగతిననే బయటపడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ దుందుడుకు వైఖరి కారణంగా ఏపీ అభివృద్ధి కుంటు పడిందని చెప్పక తప్పదు. అయితే తిరిగి ఐధేళ్లకే చంద్రబాబు మరోమారు సీఎం కావడంతో ఏపీ దశ మారిపోయిందని చెప్పక తప్పదు. చంద్రబాబు రెండో సారి సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఈ 11 నెలల్లోనే ఏపీకి ఏకంగా రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే ఏకంగా 7 లక్షల మేర ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అలా ఎక్కడి పనులు అక్కడే నిలిచిన అమరావతి నిర్మాణ పనులను చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీంతో ఏపీ ముఖచిత్రం వేగంగా మారిపోయిందని చెప్పక తప్పదు.
అటు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన అయినా…ఇటు కాంగ్రెస్ 16 నెలల పాలన అయినా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఈటెల ఆరోపించారు. తెలంగాణ కుంగుబాటుకు ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడమే వారికి సరిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పరస్పర నిందారోపణలు ఇప్పటికైనా ఆపి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే… రాజకీయ కక్షలను పక్కనపెడితే తెలంగాణ అభివృద్ధి రాకెట్ లా దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…
మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…
గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…