వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుండి సడెన్ గా గుంటూరు జిల్లా తెనాలి పర్యటనను ప్రకటించారు. మంగళవారం నాటి జగన్ పర్యటనకు సంబంధించిన నిర్ణయాన్ని వైసీపీ సోమవారం ఉదయం ప్రకటించింది. ఇటీవలే బహిరంగంగా ముగ్గురు యువకులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జాన్ విక్టర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారట. ప్రస్తుతం అతడిని పరామర్శించేందుకు జగన్ తెనాలి పర్యటనకు వెళుతున్నారు. జాన్ విక్టర్ ను పరామర్శించిన వెంటనే జగన్ తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్న ముగ్గురు యువకులపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. అంతేకాకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కారణంగానే వారిని పోలీసులు బహిరంగంగా శిక్షించినట్లు సమాచారం. అయినా ఈ ఘటన నిన్నో, మొన్నో జరగలేదు. ఈ ఘటన జరిగి దాదాపుగా వారం దాటిపోతోంది. అప్పుడు జరిగిన ఘటనపై ఇప్పుడు స్పందించిన జగన్… జాన్ విక్టర్ పరామర్శకు బయలుదేరుతుండటం గమనార్హం.
జగన్ తెనాలి పర్యటన గురించి ప్రకటన వచ్చినంతనే కూటమి ప్రభుత్వం భగ్గుమన్నది. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… జగన్ తీరుపై ఓ రేంజిలో ఫైరయ్యారు. పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నవారేమీ సజ్జనులు కాదు… వారంతా గంజాయి బ్యాచ్ లకు చెందిన నేరస్తులు.. వారిపై ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. అలాంటి వారిని పరామర్శించి జగన్ జనానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటూ అనిత తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పోలీసులపై దాడికి దిగిన నేరస్తులను శిక్షించక ముద్దు పెట్టుకుంటారా? అని కూడా ఆమె జగన్ ను ప్రశ్నించారు.
ఓ వైపు జగన్ తన తెనాలి పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే… జగన్ పర్యటనను నిర్వీర్యం చేసే దిశగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నేరస్తులను పరామర్వించే రాజకీయ నేత స్వభావం కూడా నేరపూరితమే కదా అంటూ కూటమి ప్రచారం మొదలుపెట్టింది. గతంలో అనంతపురంలో తమ పార్టీ కార్యకర్తల పరామర్శకు వెళితే…తమపై కేసులు పెట్టారని అనిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన నేరస్తుడిగా ముద్రపడిన జాన్ విక్టర్ ను పరామర్శిస్తే.. జగన్ పై కేసు నమోదు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ తెనాలి పర్యటనకు రచ్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…