టీడీపీలో నాయకులకు చంద్రబాబు అభయం ప్రసాదించారు. మహానాడు వేదికగా.. ఆయన వరుసగా చేసిన రెండు ప్రసంగాల్లో పైకి ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయకపోయినా.. ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇతరులను ఎవరినీ పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు తీసుకున్నవారిని కూడా కంట్రోల్ చేస్తున్న విధానాలను ఆయన చెప్పకనే చెప్పారు. తద్వారా.. ఇప్పుడున్న వారిదే పైచేయి అన్న మాటను ఆయన పంపించారు.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు.. గత వైసీపీ హయాంలో కేసులు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన నాయకులు కూడా.. బిక్కుబిక్కుమంటున్నారు. తమ పరిస్థితి ఏంటి? మరింత మంది కొత్త వారు వస్తే..తమ నియోజకవర్గంలో తమ హవా తగ్గితే ఏం చేయాలి? అనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే.. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. కొత్తనీరు వచ్చిన పాత నీటిని తన్నేసినట్టుగా నియోజకవర్గాల్లో సీనియర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. జంపింగులకు ఆయన దాదాపు గేట్లు మూసేశామన్న సంకేతాలు ఇచ్చారు. తద్వారా.. నియోజకవర్గాల్లో ఇప్పుడున్న వారిదే పైచేయి అన్న సంకేతాలను పంపించారు. ఇది పార్టీలో నాయకుల అసంతృప్తులకు బ్రేకులు వేసింది. అంతేకాదు. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు కూడా ప్రత్యామ్నాయం కల్పించింది. ఇప్పటి వరకు తమ ప్రాధాన్యం తగ్గుతుందని భావించిన వారికి కూడా చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టు అయింది.
ఒకరకంగా చెప్పాలంటే.. తమ్ముళ్ల రాజకీయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు.. కోవర్టు రాజకీయాలు చేసేవారికి కూడా బలమైన సంకేతాలనే పంపించారు. ఇది కూడా తమ్ముళ్లను ఖుషీ చేస్తోంది. నియోజకవ ర్గ స్థాయిలో నాయకులు తమ పనిని తాము చేసుకునేందుకు అవకాశం కల్పించడంతోపాటు.. భరోసా కూడా ఏర్పడింది. వేరే నాయకులు వస్తారని.. తమ రాజకీయాలకు గండి పడుతుందని అనుకునే వారు ఇక నుంచి ఆ ఆలోచనను పక్కన పెట్టి.. తమ పనులు చేసుకునేందుకు మార్గం సుగమమైంది.
This post was last modified on May 31, 2025 9:46 am
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…