Political News

మరో ఇద్ద‌రు పిల్ల‌ల్ని కంటారా? చంద్ర‌బాబు కొత్త సర్వే

అవును! మీరు చదివిందంతా నిజమే. పిల్లల్ని కంటారా? మీకు ఆ ఓపిక ఉందా? ఇప్పటికే మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు? వంటి అనేక ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా 20 రోజులపాటు ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ప్రతి ఇంటినీ ఈ సర్వేలో భాగం చేయనున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సర్వే ద్వారా పిల్లలను కనే సామర్థ్యం ఉన్న కుటుంబాలను గుర్తించనున్నారు.

ఎందుకు ఈ సర్వే?

రాష్ట్రంలో జనాభా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో ఉన్న జనాభాతో పోల్చితే కోటి మందికి పైగా పెరిగారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 5.3 కోట్లు. అయితే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వాటాలు పెరగాలంటే జనాభా సంఖ్య మరింత పెరగాలి. జనాభా ఆధారంగా కేంద్ర నిధులను 14వ ఆర్థిక సంఘం కేటాయించింది. ఉత్తరాది రాష్ట్రాలు — ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు — ఎక్కువ లాభం పొందుతున్నాయి. 1990–2000 మధ్య దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణ ఉద్యమం జరిగినప్పుడు, ఉత్తరాది రాష్ట్రాలు అందులో పెద్దగా పాల్గొనలేదు.

అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాయి. ఇది మంచి పరిణామమే అయినా, కేంద్ర నిధులు తగ్గిపోవడంతో ప్రభుత్వాలు అప్పుల బాట పడుతున్నాయి. జనాభా పెంచడం ద్వారా కేంద్రం నుంచి మరింత నిధులు తీసుకురావచ్చు అన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన తరచూ జనాభా పెంచాలని పిలుపు ఇస్తున్నారు. కానీ ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు సర్వే చేపడుతున్నారు.

ఏం చేస్తారు?

ఈ సర్వే ద్వారా కుటుంబంలో ప్రస్తుతం ఎంత మంది పిల్లలు ఉన్నారు అన్నది తెలుసుకుంటారు. భార్యాభర్తలు యుక్త వయసులో ఉంటే, పిల్లల్ని కనగల సామర్థ్యం ఉంటే, వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. ఇద్ద‌రు పిల్లలు ఉన్నా, మరింత మంది పిల్లలను కనాలని ప్రోత్సహించనుంది. అంతేకాదు, నలుగురు పిల్లల్ని కనే కుటుంబాలకు బ‌స్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచన కూడా ఉంది. అదనంగా, ఇతర పథకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్రమంలో మహిళల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మహిళలనే సర్వేలో భాగం చేస్తారు. ఈ సర్వేలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

This post was last modified on May 31, 2025 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

47 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

4 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

6 hours ago