కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు సందర్భంగా ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు కోవర్టులున్నారని, పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీల వారు ఆ కోవర్టులను టీడీపీలోకి పంపుతున్నారని, టీడీపీ నేతల మధ్య కలహాలు రేపడమే ప్రత్యర్థి పార్టీల, కోవర్టుల లక్ష్యమని అన్నారు. అయితే, వారి ఎత్తుగడలు పనిచేయవని చంద్రబాబు చెప్పారు. వారి ఎత్తులను చిత్తు చేస్తామని, కోవర్టులను ఏరిపారేస్తామని హెచ్చరించారు.
వలస పక్షులు పార్టీలోకి వస్తుంటాయి, పోతుంటాయని…కానీ, కార్యకర్తలే శాశ్వతమని చెప్పారు. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్టులుగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. మన వేలితో మన కన్ను పొడిపించాలని ప్రత్యర్థి పార్టీలు చూస్తున్నాయని చెప్పారు. టీడీపీ వాళ్లు..వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారని టీడీపీకి చెడ్డపేరు తేవడం… వంటి రెండు లాభాలు ప్రత్యర్థులకున్నాయని అన్నారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అని అన్నారు.
మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనిచేస్తే ఊరుకోబోనని, ఎవ్వరినీ ఉపేక్షించనని చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతోపాటు, సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసే ఆకతాయిల ఆగడాలను సహించబోనని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. అలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…