తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. తమ డిపార్ట్మెంట్ లో ఫలానా సంస్కరణలు తెచ్చామని, ఫలితాలు బాగా వచ్చాయని చెప్పగానే చంద్రబాబు స్పందన ఆసక్తికరంగా ఉంటుందని లోకేశ్ అన్న సంగతి తెలిసిందే. సంతోషం… బాగా చేశారు ఇంకా బాగా చేయండి.. నెక్స్ట్ ఏంటి అని చంద్రబాబు చెబుతారని, కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ కూడా చంద్రబాబు ఇవ్వరని లోకేశ్ అన్నారు. ఎంత చేసినా పొంగిపోకూడదని, మరింత చేయాలనే తపన పెంపొందించుకోవాలన్న లక్షణం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని లోకేశ్ అన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మహానాడు వేదిక పై తన తనయుడు నారా లోకేష్ పై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని ఆయన అన్నారు. లోకేష్ బాగా చదువుకున్నవాడని, లోకేష్ నాలెడ్జ్ ఆధారంగా ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడని కొనియాడారు. లోకేశ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని, మామూలుగా పోయే ఈ మహానాడును 6 శాసనాలు ప్రవేశపెట్టి నూతన దిశగా తీసుకువెళ్లాడని పొగడ్తలతో ముంచెత్తారు. లోకేశ్ తన నాలెడ్జ్ ను, టెక్నాలజీని ఉపయోగిస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టాడని అన్నారు.
అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వంటి నేతతో పాటు… ఉన్నత విద్యావంతుడు, యువతరం నేత నారా లోకేష్ వంటి నేత కలయికతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది. సీనియర్ నాయకులందరికీ చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తుంటే…యువ నేతలందరికీ లోకేష్ మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని, ఇదే సరైన సమయం అని టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం, లోకేశ్ ను ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో, లోకేశ్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని చంద్రబాబు కూడా ఫిక్స్ అయ్యారని, తాజాగా ఆయన చేసిన కామెంట్లే హింట్ అని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…