Political News

‘మ‌హానాడు’.. అస‌లీ పేరు ఎలా వ‌చ్చింది?

‘మ‌హ‌నాడు’.. ఇది టీడీపీకి మాత్ర‌మే సొంత‌మైన పేరు. వాస్త‌వానికి ప్ర‌తి పార్టీ కూడా ప్లీన‌రీ పేరుతో ఆ పార్టీ విధి విధానాల‌ను ఏటా చ‌ర్చిస్తుంది. ద‌శ‌-దిశ‌ల‌ను క‌ల్పిస్తుంది. కానీ, ఇత‌ర పార్టీల‌కు.. టీడీపీకి మ‌ధ్య తేడా ఉంది. ఆయా పార్టీలు ఆవిర్భ‌వించిన రోజును పుర‌స్క‌రించుకుని ప్లీన‌రీని నిర్వ‌హిస్తాయి. అక్క‌డి నుంచి రెండు రోజులు మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు ఉంటాయి.

కానీ, టీడీపీలో అలాకాదు. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మాజీ సీఎం ఎన్టీఆర్ పుట్టిన రోజు(మే 28)ను పుర‌స్కరించుకుని మ‌హానాడును నిర్వ‌హించ‌డం ప్రారంభ‌మైంది. దీనికి అంకురార్ప‌ణ చేసింది కూడా.. ఎన్టీఆరే కావ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి పార్టీ ఆవిర్భ‌వించింది.. మార్చి 29, 1982వ సంవ‌త్స‌రంలో. ఇలా చూసుకుంటే.. పార్టీ ప్లీన‌రీ కూడా.. త‌దుప‌రి సంవ‌త్స‌రాల నుంచి మార్చి 29నే జ‌ర‌గాలి. కానీ, అలా కాకుండా అన్నగారి పుట్టిన రోజున నిర్వ‌హిస్తారు.

అస‌లీ పేరు ఎలా వ‌చ్చింది?

మ‌హానాడు.. అనేది చాలా చిత్ర‌మైన ప‌దం!. ఈ పేరు ఎలా వ‌చ్చింద‌నే విష‌యం చాలా మందికి ఆస‌క్తి. మ‌హా.. అంటే చాలా గొప్ప‌ది అని అర్థం. నాడు.. అనే ప‌దానికి రోజు, ప‌ర్వ‌దినం అనే స‌మానార్ధ‌కాలు ఉన్నాయి. ఇలా చూసుకున్న‌ట్టు మ‌హానాడు అంటే.. చాలా గొప్ప రోజు అనే అర్థం ఉంది. దీనినే అన్న‌గారు ఖ‌రారు చేశారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీకగా… తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ఢిల్లీ వ‌ర‌కు వినిపించిన ఆయ‌న‌.. త‌న పుట్టిన రోజు నాడే.. పార్టీకి నిజ‌మైన పండుగగా భావించారు. అందుకే మ‌హానాడు(దీనిని ఓ ప‌త్రిక య‌జ‌మాని సూచించార‌ని అంటారు.)ను నిర్వ‌హిస్తున్నారు.

తొలిసారి ఇక్క‌డే..!

తొలిసారి మ‌హానాడును విజ‌య‌వాడ‌లోని కృష్ణాన‌ది తీరంలో(తాడేప‌ల్లి వైపు) 1983, మే 28, 29 తేదీల్లో రెండు రోజులు మాత్ర‌మే నిర్వ‌హించారు. అందుకే.. ఈ ప్రాంతానికి ఇప్ప‌టికీ.. మ‌హానాడు అనే పేరుతోనే పిలుస్తారు. ఇక్క‌డివారికే ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్ ఇంటి ప‌ట్టాలు అందించారు. ఇలా మొద‌లైన సంరంభం.. త‌ర్వాత త‌ర్వాత‌.. పార్టీ నాయ‌కుల అభ్య‌ర్థ‌ల‌న మేర‌కు మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు.

అయితే.. దీనిని కూడా.. మే28కి ముందు, త‌ర్వాత‌.. నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మ‌హానాడును ఏటా నిర్వ‌హిస్తున్నా.. కొన్ని కార‌ణాల‌తో .. ప‌లు సార్లు వాయిదా వేశారు. 1985లో నాదెండ్ల భాస్క‌ర‌రావు సృష్టించిన వివాదం కార‌ణంగా, 1991లో ఒక‌సారి, 1996లో మ‌రోసారి వాయిదా వేశారు. ఇక‌, 2012లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలోనూ వాయిదా వేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 27, 2025 10:47 am

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

18 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago