రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించి… అందులో భాగంగానే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా దక్కిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా జగన్ పార్టీకి నిజంగానే ఇచ్చి పడేశారు. జగన్ కోటరీ అంటూ ప్రస్తావిస్తూ సాగిన ఆయన ప్రకటన… తననే జగన్ కోటరీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తనకు అనుంబంధం ఉందన్న సాయిరెడ్డి… కేవలం కోటరీ చెప్పిన మాటలు విని జగన్ తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక టీడీపీ కీలక నేత, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న టీడీ జనార్ధన్ తో తాను భేటీ అయినట్లుగా వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కూడా సాయిరెడ్డి వివరణ ఇచ్చారు. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంతో తనకు ఏళ్ల తరబడి అనుబంధం ఉందన్న సాయిరెడ్డి… కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడికి టీడీ జనార్ధన్ వస్తారని తనకు తెలియదని, ఆయన వచ్చినా… తామేమీ మాట్లాడుకోలేదని కూడా సాయిరెడ్డి తెలిపారు.
ఇక టీడీపీ నేతలతో తాను కలవనని గతంలోనే చెప్పానని సాయిరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కలవాలి అనుకుంటే… తానే స్వయంగా చంద్రబాబును గానీ, లోకేశ్ ను గానీ బహిరంగంగానే కలుస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ లు తనకు రాజకీయ ప్రత్యర్థులే… అయితే అది గతం.. ఇప్పుడు కాదు అని ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబు, లోకేశ్ లను కలిసే వెసులుబాటు ఉన్నా తానెందుకు ఇతరులను కలుస్తానని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ జన్మకు తాను టీడీపీలో చేరేది లేదని ఇదివరకే చెప్పానని కూడా సాయిరెడ్డి గుర్తు చేశారు.
ఇక ఇప్పుడు కూడా తాను వైసీపీ ప్రచారంపై ఎందుకు స్పందిస్తున్నానన్న విషయాన్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. జగన్ కోటరీ తనను గిల్లడం వల్లే తాను ఇప్పుడు స్పందించాల్సి వస్తోందని ఆయన అన్నారు. అయినా ఎవరో కోటరీ చేసిన నేరాలను నా నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు,లేదంటే వెన్నుపోటుదారుడా? అని ఆయన జగన్ ను నిలదీశారు. 2011లో జగన్ అడిగారని 21 కేసులను తన నెత్తిన వేసుకున్నానని చెప్పిన సాయిరెడ్డి… 2025లో కూడా జగన్ అడిగి ఉంటే… తాజా కేసులనూ తనపైనే వేసుకునే వాడిని అన్నారు. అయితే జగన్ తాను నేరుగా అడగకుండా కోటరీ చేత అడిగించి తనను దూరం పెట్టారని సాయిరెడ్డి ఆరోపించారు. మొత్తానికి సాయిరెడ్డి స్పందించిన ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
This post was last modified on May 27, 2025 8:14 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…