బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటా పోటీగా నినాదాలు చేసుకోవడంతోపాటు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలపైనా లాఠీ చార్జి చేశారు. చెదర గొట్టారు.అంతేకాదు.. కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ.. పరిస్థితులు ఉద్రిక్తతంగానే కొనసాగుతున్నాయి.
ఏం జరిగింది?
మాజీ మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభ ఉప పక్షనాయకుడిగా కొనసాగుతున్నారు. ఈయనకు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో క్యాంపు కార్యాలయం ఉంది. ఇది అధికారిక బంగళా. దీనిని ప్రభుత్వమే కేటాయించిందని.. కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. అయితే.. నిన్న మొన్నటి వరకు లేని వివాదం సోమవారం తలెత్తింది. కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
అధికారిక బంగళా కాబట్టి.. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనిని బీఆర్ ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నారు. చివరకు విషయం పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పక్షాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. వారు శాంతించకపోవడంతో లాఠీ చార్జి చేశారు. అనంతరం.. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. కాగా.. దీనిపై అటు ప్రభుత్వం, ఇటు బీఆర్ ఎస్ కీలక నాయకులు ఎవరూ స్పందించలేదు.
This post was last modified on May 26, 2025 5:55 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…