Political News

మిస్ ఇంగ్లండ్ ఆరోప‌ణ‌లు.. విచార‌ణ‌కు రేవంత్ ఆదేశం

హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న‌’మిస్ వ‌రల్డ్’ పోటీల్లో వివాదాస్ప‌ద తీరు క‌నిపిస్తోంద‌ని.. త‌న‌ను వేశ్య‌లా చూస్తున్నార‌ని పేర్కొంటూ.. బ్రిట‌న్‌కు చెందిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం రేపాయి. ఆమె ఆరోప‌ణ‌ల‌ను మిస్ వ‌రల్డ్ నిర్వాహ‌కులు కొట్టి పారేసినా.. జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాలో ప్ర‌ముఖంగా ఇవి హైలెట్ అయ్యాయి. పైగా.. రాష్ట్రంలోనూ ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నుంచి ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది మ‌హిళ‌ల ఆత్మాభిమానానికి సంబంధించిన విష‌య‌మ‌ని .. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మిస్ ఇంగ్లండ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ పై విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ విచార‌ణ క‌మిటీలో అంద‌రూ మ‌హిళా అధికారులే ఉండ‌నున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్‌, ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ సాయిశ్రీ తో కూడిన క‌మిటీని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తాజాగా ప్ర‌క‌టించారు. మాగీ చేసిన ఆరోప‌ణ‌లు.. మిస్ వ‌రల్డ్ పోటీలు జ‌రుగుతున్న తీరును వారు నిశితంగా విశ్లేషించి.. విచార‌ణ జ‌రిపి ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించ‌నున్నారు. ముఖ్యంగా వేశ్య‌లా చూస్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌ను స‌ర్కారు కూడా సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణించింది.

ఏయే విష‌యాల‌పై విచార‌ణ‌..

ప్ర‌భుత్వం నియ‌మించిన ఐపీఎస్‌ల క‌మిటీ.. ప్ర‌ధానంగా ఐదు అంశాల‌పై విచార‌ణ చేప‌ట్ట‌నుంది. 1) మాగీ వ‌చ్చినప్ప‌టి నుంచి ఆమె తిరిగిన ప్ర‌దేశాలు.. ఎవ‌రెవ‌రితో క‌లిసి ఆమె కంటెస్టులో పాల్గొన్నారు. 2) మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ వ్య‌వ‌హారం.. ఆయ‌న ఆదేశాలు స‌హా.. ఇత‌ర కంటెస్టెంట్ల వ్య‌వ‌హార శైలిని కూడా క‌మిటీ విచారించ‌నుంది. 3) మాగీ పాల్గొన్న డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు? అనే విష‌యంపైనా ఆరా తీయ‌నున్నారు. 4) పోటీల‌కు స్పాన్స‌ర్ చేసిన ధ‌న‌వంతులు ఎవ‌రు? 5) మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌, ఆత్మ‌గౌర‌వం కాపాడేందుకు తీసుకున్న చ‌ర్య‌లు ఏంటి? అనే ఐదు కోణాల్లోనూ ఈ మ‌హిళా ఐపీఎస్ అధికారుల క‌మిటీ విచార‌ణ జ‌ర‌పనుంది.

This post was last modified on May 26, 2025 7:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

27 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago