Political News

క‌విత‌కు కాదు.. కేటీఆర్‌కే ఆహ్వానం.. కేసీఆర్‌తో భేటీ!

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య.. క‌విత రాసిన లేఖ తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దుమారం తాలూకు రాజకీయం ఇంకా కొన‌సాగుతోంది. పంతం నీదా-నాదా.. అన్న‌ట్టుగా సాగుతున్న రాజ‌కీయాల్లో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వాస్త‌వానికి క‌విత త‌న తండ్రితో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నారు. లేఖ అనంత‌రం.. జ‌రిగిన ప‌రిణామాలు కూడా.. కేసీఆర్ ఖ‌చ్చితంగా క‌విత‌ను పిలుస్తార‌ని.. చ‌ర్చిస్తార‌నే అనుకున్నారు.

కానీ, ఆదివారం మ‌ధ్యాహ్నం.. అనూహ్యంగా “రా.. ర‌మ్మంటూ” కేసీఆర్ నుంచి కేటీఆర్ కు ఫోను వ‌చ్చింది. దీంతో కేటీఆర్ ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో క‌విత వ్య‌వ‌హారం.. పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం దీనిపై చ‌ర్చ పెట్టొద్ద‌ని, దీనివల్ల ప్ర‌త్య‌ర్థి శిబిరాలకు రాజ‌కీయ అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం జ‌రిగిన యాగీ చాల‌ని.. దీనిని పెంచుకుంటూ పోవ‌ద్ద‌ని సూచించార‌ని తెలిసింది.

లేఖ విష‌యాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తాను చూసుకుంటాన‌ని కేసీఆర్ తేల్చి చెప్పారు. అంతేకాదు.. దీనిపైనే రాజ‌కీయాలు చేసుకుంటూ పోతే.. స‌రికాద‌ని కూడా స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. అంత‌ర్గ‌త విష‌యాల‌పై చ‌ర్చించేందుకు బ‌హిరంగ వేదిక‌లు కీల‌కం కావ‌డానికి వీల్లేద‌ని కూడా కేసీఆర్ తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. టీవీ డిబేట్లు, ఇత‌రత్రా మీడియా స‌మావేశాల్లోనూ.. నాయ‌కులు ఎవ‌రూ లేఖ‌పై మాట్లాడొద్ద‌ని చెప్పారు.

ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న చేయాలని కేటీఆర్‌కు తేల్చి చెప్పారు. ఇక‌, మ‌రో వారం రోజుల్లో జ‌ర‌గాల్సిన రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించాల్సి న కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి కేటీఆర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాల‌యా ల‌లోవేడుక‌ల‌కు శ్రీకారం చుట్టాల‌ని.. తెలంగాణ అస్తిత్వాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని కూడా కేసీఆర్ వివ‌రించారు.

This post was last modified on May 25, 2025 6:07 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

14 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

55 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago