భారత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే తొలి మూడు స్థానాల్లో నిలబెడతానంటూ.. తరచుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి ఆయన ఐదేళ్ల వరకు సమయం విధించుకున్నారు. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో తాజాగా ఓ అడుగు ముందుకు పడింది. తొలి ఐదు దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు ఒక మెట్టు జంప్ చేసింది.
ప్రస్తుతం నాలుగో అదిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ను తోసిపుచ్చి.. ఆ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం వెల్లడించారు. జపాన్ ప్రస్తుతం నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని.. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుందని వివరించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని.. దీంతో జపాన్ను అధిగమించామని ఆయన వివరించారు.
ఇక, ప్రపంచ వ్యాప్తంగా తొలి ఐదు స్థానాల్లో ఉన్న కీలక ఆర్థిక దేశాలు..
1) అమెరికా
2) చైనా
3) జర్మనీ
4) భారత్(ఇప్పటి వరకు ఐదోస్థానంలో ఉండేది)
5) జపాన్
ఏంటి కారణం?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనంతరం.. ఆర్థికంగా దేశాలు దెబ్బతిన్నాయి. కానీ, భారత్ నిలదొక్కుకుంది. అదేవిధంగా పలు దేశాలు యుద్ధంతో అట్టుడుకుతున్నాయి. కానీ, శాంతి మంత్రాన్ని జపిస్తున్న భారత్ యుద్ధానికి కడుదూరంలో ఉంది. అదేసమయంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మైలురాయిని చేరిందని సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
This post was last modified on May 25, 2025 2:37 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…