Political News

జ‌పాన్‌ను ప‌క్క‌కు నెట్టిన భార‌త్ .. స‌రికొత్త రికార్డు!

భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌పంచంలోనే తొలి మూడు స్థానాల్లో నిల‌బెడ‌తానంటూ.. త‌ర‌చుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి ఆయ‌న ఐదేళ్ల వ‌ర‌కు స‌మ‌యం విధించుకున్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో భార‌త దేశాన్ని ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దుతామ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో తాజాగా ఓ అడుగు ముందుకు ప‌డింది. తొలి ఐదు దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న భార‌త్‌.. ఇప్పుడు ఒక మెట్టు జంప్ చేసింది.

ప్ర‌స్తుతం నాలుగో అదిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న జ‌పాన్‌ను తోసిపుచ్చి.. ఆ స్థానాన్ని భార‌త్ కైవ‌సం చేసుకుంది. తాజాగా ఈ విష‌యాన్ని నీతి ఆయోగ్ సీఈవో సుబ్ర‌హ్మ‌ణ్యం వెల్ల‌డించారు. జ‌పాన్ ప్ర‌స్తుతం నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉంద‌ని.. అయితే.. ఇప్పుడు తాజాగా ఈ స్థానాన్ని భార‌త్ కైవ‌సం చేసుకుందని వివ‌రించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంద‌ని.. దీంతో జ‌పాన్‌ను అధిగ‌మించామ‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇక‌, ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి ఐదు స్థానాల్లో ఉన్న కీల‌క ఆర్థిక దేశాలు..

1) అమెరికా
2) చైనా
3) జర్మనీ
4) భార‌త్‌(ఇప్ప‌టి వ‌ర‌కు ఐదోస్థానంలో ఉండేది)
5) జ‌పాన్‌

ఏంటి కార‌ణం?

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా అనంత‌రం.. ఆర్థికంగా దేశాలు దెబ్బ‌తిన్నాయి. కానీ, భార‌త్ నిల‌దొక్కుకుంది. అదేవిధంగా ప‌లు దేశాలు యుద్ధంతో అట్టుడుకుతున్నాయి. కానీ, శాంతి మంత్రాన్ని జ‌పిస్తున్న భార‌త్ యుద్ధానికి క‌డుదూరంలో ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌పంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దీంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఒక కీల‌క మైలురాయిని చేరింద‌ని సుబ్ర‌హ్మ‌ణ్యం వెల్ల‌డించారు.

This post was last modified on May 25, 2025 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago