సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించుకున్న సువిశాల భవనం.. గృహ ప్రవేశం ఆదివారం తెల్లవారుజామును జరిగింది. శనివారం రాత్రి ఢిల్లీ నుంచినేరుగా హైదరాబాద్కు.. అక్కడ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకున్నారు. అనంతరం.. ఆయన నిద్రకూడా పోకుండానే.. గృహ ప్రవేశ ఘట్టంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది పార్టీ నాయకులు, మంత్రులు, వీఐపీలను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకు అందరినీ ఆహ్వానించారు. ఇక, ఈ గృహ ప్రవేశ ఘట్టంలో షడ్ర శోపేత మైన విందును ఇస్తున్నారు. ప్రధానంగా రెండు రకాలుగా విందు ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, మంత్రులకు వేరుగా.. నియోజకవర్గం ప్రజలకు వేరుగా వంటకాలు సిద్ధం చేయిస్తున్నారు. వీటిలో తేడా లేకపోయినా.. వీవీఐపీలకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది.
ఇక, వంటకాల విషయానికి వస్తే..
చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా, ఆలూ సమోసా, జొన్న పిండి సమోసా, టమోటా రైస్, వెజ్ బిరియాని, రైతా, మామిడి కాయలతో తయారు చేసిన అన్నం, మఫ్రూమ్(పుట్టగొడుగులు) గుజ్జు కూర, బెండకాయ ఫ్రై, గుత్తివంకాయ మసాలా, వడపులు, ఆలూ ఫ్రై, టమాటా బీరకాయపచ్చడి, వైట్ రైస్, ఘీరైస్, లెమన్ రైస్, ఎల్లో రైస్, పరమాన్నం, రసం, సాంబార్, గోంగూర పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటుగా ఆవకాయ కూడా ఏర్పాటు చేశారు. ఇక, ప్రత్యేక వంటకంగా.. క్యారెట్ హల్వా వడ్డించారు. చివరిలో ఐస్క్రీమ్, పాన్ అందించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…