సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించుకున్న సువిశాల భవనం.. గృహ ప్రవేశం ఆదివారం తెల్లవారుజామును జరిగింది. శనివారం రాత్రి ఢిల్లీ నుంచినేరుగా హైదరాబాద్కు.. అక్కడ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకున్నారు. అనంతరం.. ఆయన నిద్రకూడా పోకుండానే.. గృహ ప్రవేశ ఘట్టంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది పార్టీ నాయకులు, మంత్రులు, వీఐపీలను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకు అందరినీ ఆహ్వానించారు. ఇక, ఈ గృహ ప్రవేశ ఘట్టంలో షడ్ర శోపేత మైన విందును ఇస్తున్నారు. ప్రధానంగా రెండు రకాలుగా విందు ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, మంత్రులకు వేరుగా.. నియోజకవర్గం ప్రజలకు వేరుగా వంటకాలు సిద్ధం చేయిస్తున్నారు. వీటిలో తేడా లేకపోయినా.. వీవీఐపీలకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది.
ఇక, వంటకాల విషయానికి వస్తే..
చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా, ఆలూ సమోసా, జొన్న పిండి సమోసా, టమోటా రైస్, వెజ్ బిరియాని, రైతా, మామిడి కాయలతో తయారు చేసిన అన్నం, మఫ్రూమ్(పుట్టగొడుగులు) గుజ్జు కూర, బెండకాయ ఫ్రై, గుత్తివంకాయ మసాలా, వడపులు, ఆలూ ఫ్రై, టమాటా బీరకాయపచ్చడి, వైట్ రైస్, ఘీరైస్, లెమన్ రైస్, ఎల్లో రైస్, పరమాన్నం, రసం, సాంబార్, గోంగూర పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటుగా ఆవకాయ కూడా ఏర్పాటు చేశారు. ఇక, ప్రత్యేక వంటకంగా.. క్యారెట్ హల్వా వడ్డించారు. చివరిలో ఐస్క్రీమ్, పాన్ అందించారు.
This post was last modified on May 25, 2025 2:08 pm
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…