ఏ పార్టీలో అయినా.. నాయకులకు సంతృప్తి-అసంతృప్తి అనేవి రెండూ ఉంటాయి. రెండు ఉన్న వారు కూడా ఉంటారు. ఎంత చేసినా అసంతృప్తేనా? అనే మాట హైకమాండ్ నుంచి వినిపిస్తుంది. కానీ ఎంతో చేస్తున్నాం.. అయినా తమకు గుర్తింపు లేదని క్షేత్రస్తాయిలో నాయకులు అంటారు. ఈ రెండు ఏ పార్టీలో అయినా కామనే. అయితే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉన్న టీడీపీలో ఇప్పుడు.. మరింత ఎక్కువగా ఈ మాట వినిపిస్తోంది.
మరొ మూడో రోజుల్లో మహానాడు మొదలు కానుంది. వచ్చే నాలుగేళ్లకు సరిపడా ప్లాన్లను.. వచ్చే ఎన్నికలకు రహదారులను కూడా ఈ మహానాడు వేదిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వేయనున్నారు. అయితే.. భవిష్యత్తు ఎలా ఉన్నా.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో 72 నియోజకవర్గాల్లో నిర్వహించిన మినీ మహానాడులు నాయకుల అసంతృప్తిని స్పష్టం చేసింది. దీనిలో ప్రధానంగా చంద్రబాబును కలుసుకునే అవకాశం లేకుండా పోయిందని ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాదు.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు.. తాము ఎదుర్కొంటున్న రాజకీయాలను వివరించేందుకు నియోజకవర్గం అభివృద్ధినిధులను రాబట్టుకునేందుకు కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ఒకరు ఇద్దరు అయితే.. ఓకే. కానీ, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు.. సీఎంను కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పోనీ.. ఇలా చెబుతున్న వారు జూనియర్లు కూడా కాదు. వీరిలో సీనియర్లే ఉన్నారు.
బండారు సత్యనారాయణ మూర్తి, జ్యోతుల నెహ్రూ. గద్దె రామ్మోహన్ ఇలా.. చెప్పుకొంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీరందరి ఆవేదన, అసంతృప్తి కూడా.. చంద్రబాబు తమకు అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. తమ నియోజకవర్గంలో పనులు చేపట్టలేక పోతున్నామనే. సో.. ఇది పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం.. బాధ్యత కూడా సీఎం చంద్రబాబుపైనే ఉంది. కాబట్టి.. ఆయన వీరికి టైం ఇవ్వాల్సిన.. వారి మాట వినాల్సిన అవసరం రెండూ ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 25, 2025 8:55 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…