Political News

వైసీపీ టాక్‌: సాయిరెడ్డిని కెలికి త‌ప్పు చేశారు ..!

వైసీపీ కీల‌క మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డిపై రెండు రోజుల కింద‌ట వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే..ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు మైలేజీఇవ్వ‌క‌పోగా.. పార్టీలో నేత‌ల నుంచే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి. సాయిరెడ్డిని కెలికి త‌ప్పు చేశారు స‌ర్‌! అంటూ ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నాయకులు తాజాగా జ‌గ‌న్ చెవిలో వేసిన‌ట్టు తెలిసింది. తాజాగా ఇద్ద‌రు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే నాయ‌కులు ఆయ‌న‌నుక‌లిసారు.

ప్ర‌స్తుతం సాయిరెడ్డి సైలెంట్గా ఉన్నార‌ని.. ఆయ‌న వైలెంట్ గా మారితే మ‌న‌కే ఇబ్బందుల‌ని కూడా.. జ‌గ‌న్‌కు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. మ‌ద్యం కుంభ‌కోణంలో సాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలుస్తున్న‌ట్టు వారు స‌మాచారం ఇచ్చారు. ఇదే జ‌రిగితే.. ఇబ్బందులు పెరుగు తాయ‌ని.. చెప్పుకొచ్చార‌ని తెలిసింది. మీరు బాగానే ఉంటారు. దీనిపై మాకు కూడా న‌మ్మ‌కం ఉంది. కానీ, కేడ‌ర్ దెబ్బ‌తింటుంది అని గుంటూరుకు చెందిన ఓ వృద్ధ నేత జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు ద్వారా తెలిసింది.

అయితే.. దీనికి జ‌గ‌న్ చిత్ర‌మైన స‌మాధానం చెప్పార‌ని అంటున్నారు. అన్నీ చూడాల‌న్నా.. ఏం జ‌రిగినా త‌ట్టుకునే వారే మ‌న‌కు కావాలి. రేపు అధికారంలోకి వ‌చ్చాక వారికే ప్రాధాన్యం ఉంటుంది అని న‌వ్వుతూ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల‌తో వైసీపీలో జ‌గ‌న్ వ్య‌వ‌హారం మ‌రోసారి ర‌చ్చ‌గా మారింది. ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా మ‌రింత దూరం అవుతార‌ని అంటున్నారు. ఇది స‌రైన విధానం కాద‌ని కూడా చెబుతున్నారు.

పార్టీలో ఉన్న నాయ‌కుల‌కు భ‌రోసా ఇవ్వాలంటే.. వెళ్లిపోయిన వారిని సాధ్య‌మైనంత వ‌ర‌కు విమ‌ర్శించ కుండా ఉంటేనే బెట‌ర్ అన్న విధంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ‌తంలో కేసుల‌తో సంబంధాలుఉన్న వారి విష‌యంలో అయితే.. అస‌లు సాధ్య‌మైనంత వ‌ర‌కు మౌనంగా ఉంటేనే బెట‌ర్ అనికూడా వ్యాఖ్యానిం చిన‌ట్టు తెలిసింది. కానీ.. జ‌గ‌న్ వినే ర‌కం కాదు కాబ‌ట్టి.. వారు చెప్ప‌డం వ‌రకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు.

This post was last modified on May 24, 2025 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

14 minutes ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

2 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

4 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

4 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

6 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

8 hours ago