పెద్ది టాక్స్, డిస్కషన్ల సంగతి పక్కనపెడితే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న మాట వాస్తవం. కొన్ని ఏరియాలలో పుష్ప 2ని దాటేసిన వైనం నెంబర్లలో కనిపిస్తోంది. ప్రమోషన్ల పరంగా టీమ్ పెద్దగా సౌండ్ చేయడం లేదు. అప్పలసూరిగా మెప్పించిన జగపతిబాబు కెరీర్ లో మొదటిసారేమో అనిపించేలా, పోస్ట్ రిలీజ్ తర్వాత మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ది విశేషాలు పంచుకుంటున్నారు. నెగటివ్ చేసిన వాళ్లకు తగిన సమాధానమిస్తూ ఆసక్తి పెంచేలా ప్రయత్నం చేస్తున్నారు.
విడుదలకు ముందు హడావిడి చేసిన బోమన్ ఇరానీ సైలెంట్ అయిపోయారు. విడుదలకు ముందు ప్రతి చోట కనిపించిన దివ్యెందు శర్మ తర్వాత ఒక వీడియో బైట్ కూడా ఇవ్వలేదు. జాన్వీ కపూర్ సంగతి సరేసరి. ఊహించని వివాదం తన పాత్రకు రావడంతో సైలెంట్ అయిపోయింది. కమెడియన్ సత్యకు స్కోప్ తక్కువ కాబట్టి ఏం మాట్లాడలేడు. బెంగళూరు థియేటర్ లో స్పెషల్ షో చూసిన తర్వాత శివరాజ్ కుమార్ తన పనుల్లో తాను బిజీ అయిపోయారు. ఫైనల్ గా కనిపిస్తోంది ఒక్క జగపతిబాబు మాత్రమే.
నిజానికి పెద్ది, అప్పలసూరి మధ్య చాలా సీన్లు ఎడిటింగ్ లో ఎగిరిపోయాయి. ఈ మాట జగ్గు భాయ్ స్వయంగా చెప్పారు. వాటిని నెట్ ఫ్లిక్స్ లో అతికిస్తారా లేక ఈ వీకెండ్ లో థియేటర్ లో జోడిస్తారా అనేది టీమ్ చెప్పడం లేదు. విచిత్రం ఏమిటంటే సోషల్ మీడియాలో జగపతిబాబు పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. రామ్ చరణ్ తప్ప ఎవరూ హైలైట్ కాలేదు. తన కష్టాన్ని తానే మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో జగ్గు భాయ్ రంగంలోకి దిగిపోయారు.
నెక్స్ట్ సక్సెస్ మీట్ చేస్తారనే టాక్ ఉంది. అదేదో ఆదివారం లోపు చేస్తే బెటర్. టికెట్ రేట్లు కూడా ఆ రోజు నుంచే సాధారణ స్థితికి రాబోతున్నాయి. ఫ్లాప్ టాక్ రానప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా పబ్లిసిటీ నిత్యం జరుగుతూ ఉండాలి. కలెక్షన్ల పోస్టర్లు ఒకటే సరిపోవు. ఏదో ఒక కంటెంట్ తో జనాన్ని పలకరిస్తూ ఉంటే ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. ఆటోమేటిక్ గా వసూళ్లు పెరుగుతాయి. ఆ దిశగా టీమ్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి.
రాజ రాజ చోర, స్వాగ్ దర్శకుడు హసిత్ గోలి, మాస్ మహారాజ రవితేజ కలయికలో ఒక సినిమా రూపొందబోయే సంగతి…
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఒక ఎడతెగని పంచాయితీగా మారుతోంది. నిర్మాతలు రేట్ల పెంపు కోసం ప్రభుత్వానికి…
వన్ సైడ్ లవ్ తెలుగు తెరకు కొత్త కాదు. కొన్ని వందల సార్లు చూసుంటాం. కాకపోతే చెప్పే విధానంలో దర్శకులు…
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్ మొదలై రెండేళ్లు కావస్తోంది. కానీ ఎంతకీ…
దర్శకులు నటులుగా మారినంత తేలిగ్గా.. నటులు దర్శకులు కాలేరు. ఎందుకంటే 24 విభాగాలనూ కోఆర్డినేట్ చేస్తూ సినిమా తీయడం అన్నది…
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…